శారద పీఠం వార్షికోత్సవ వేడుక

విశాఖపట్నం చినముషిడివాడ శారద పీఠం వార్షికోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో కలసి పాల్గొన్న మాజీమంత్రి శిద్దా రాఘవరావు, శిద్దా సుధీర్ కుమార్.విశాఖపట్నం శ్రీ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు
vzg-swamy2 ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి,పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందసరస్వతి స్వామి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో కలసి ఆశీస్సులు అందుకున్న శిద్దా రాఘవరావు, శిద్దా సుధీర్ కుమార్.

పీఠంలో బుధవారం నిర్వహించిన గురు వందనం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం,రాజశ్యామల యాగం మహా పూర్ణాహుతి, చతుర్వేద పారాయణ,అగ్ని హోత్ర సభ ప్రారంభం, నిత్య పీఠ పూజ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో శిద్దా రాఘవరావు, శిద్దా సుధీర్ కుమార్
vizag-swamy పాల్గొన్నారు. పీఠంలో వేంచేసి ఉన్న రాజశ్యామల అమ్మవారికి,ఉమామహేశ్వర స్వామి వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో కలసి శిద్దా రాఘవరావు శిద్దా సుధీర్ కుమార్ విశేష పూజలు నిర్వహించి అమ్మవారి,స్వామి వారి ఆశిస్సులు అందుకున్నారు.శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, శిద్దా రాఘవరావు శిద్దా సుధీర్ కుమార్ కు అమ్మవారి తీర్థప్రసాదాలు శేష వస్త్రాలు అందచేసి ఆశీస్సులు అందజేశారు.

Leave a Reply