Suryaa.co.in

Editorial

కర్నాటక నుంచి రాజ్యసభకు షర్మిల?

  • ఖరారయిన కాంగ్రెస్ సీటు

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీసీసీ చీఫ్, వైఎస్ ముద్దులబిడ్డ షర్మిలారెడ్డికి రాజ్యసభ సీటు ఖరారయింది. కర్నాటక నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. ఆ మేరకు పార్టీ యువనేత రాహుల్, సోనియా ఇచ్చిన హామీ నెరవేరనుంది.వైఎస్‌కు అత్యంత సన్నిహితుడైన కర్నాటక డిప్యూటీ సీఎం డి కె శివకుమార్, ఆమె పార్టీలో చేరే ముందు ఆ మేరకు హామీ ఇచ్చారు. తర్వాత దానిని రాహుల్ ఆమోదించారు.

నిజానికి అదే కర్నాటక నుంచి ఈ అవకాశం గతంలోనే వచ్చినప్పటికీ, కేవలం రెంండేళ్ల పదవీకాలం ఉన్నందున ఆమె ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కర్నాటక నుంచి షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా, ఏపీలో పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంటుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

నిజానికి అన్న జగన్ జైల్లో ఉన్నప్పుడు.. అన్న కోసం పాదయాత్ర చేసిన తర్వాత, ఆమె పార్లమెంటుకు వెళ్లేందుకు ఆసక్తి చూపారు. కానీ ఒక కుటుంబంలో ఒకరే రాజకీయాల్లో ఉండాలన్న సూత్రాన్ని పైకి తెచ్చిన జగన్, ఆమెను వ్యాపారాలు చూసుకోమని చెప్పారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సలహానే అన్నది అప్పట్లో పార్టీలో వినిపించిన టాక్.

అయితే వ్యాపారాల్లో కూడా ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకపోగా, బహుమతిగా ఇచ్చిన ఆస్తులను కూడా వెనక్కి తీసుకోవడంతో చెల్లి షర్మిల, అన్న జగన్‌పై తిరుగుబాటు బావుటా ఎగరవేసింది. మొత్తానికి పార్లమెంటుకు వెళ్లాలన్న చెల్లి కోరికను.. ‘అసలు అన్న’ జగన్ నెరేవర్చపోయినా, ‘కొసరు అన్న’ రాహుల్ ద్వారా నెరవేరబోతుందన్నమాట!

LEAVE A RESPONSE