Suryaa.co.in

Telangana

వేములవాడలో వైభవంగా ప్రారంభమైన శివ కళ్యాణ మహోత్సవాలు

రాజన్న జిల్లా : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమ య్యాయి. ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తిలకించడానికి శివపా ర్వతులు, జోగినిలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు.

30వ తేదీన నగరంలోని పురవీధుల్లో స్వామి వారి రథోత్సవం సాగనుంది. శివ కళ్యాణ మహోత్సవాల నేపథ్యంలో ఐదు రోజుల పాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు రద్దు చేసి నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. కాగా బుధవారం సాయం త్రం 3 గంటల వరకు కోళ్ల మొక్కుల చెల్లింపులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

LEAVE A RESPONSE