మహేశ్వరంలో మంత్రి సబితకు షాక్

– ‘కారు’ దిగి, ‘కమలవనం’లో చేరిన తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధు

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ ఛైర్మన్ కాంటేకార్ మధు మోహన్ బీజేపీలో చేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ మంతనాలు ఫలించటంతో కాషాయం కండువా కప్పుకున్నారు.

ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన కాంటేకార్ మధు మోహన్ కు ఛైర్మన్ ఆశచూపి కారెక్కించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కొంతకాలంగా బీజేపీ ముఖ్య నేత, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములుతో టచ్ లో ఉన్న ఛైర్మన్ మధు మోహన్, పార్టీలో చేరేందుకు అంగీకరించారు. దీంతో రెండురోజుల క్రితం ఢిల్లీకి పంపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, తూళ్ల వీరేందర్ గౌడ్ సహా బీజేపీ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.

Leave a Reply