రేవంత్ రెడ్డి సహా మరికొందరికి సిట్ అధికారులు నోటీసులు జారీ

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీకేజీపై ఆరోపణలు చేస్తున్న వారందరికీ సిట్ నోటీసులు ఇస్తోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా మరికొందరికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మల్యాల మండలంలో 100 మందికిపైగా గ్రూప్-1లో మంచి ర్యాంకులు వచ్చాయని రేవంత్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన దగ్గర ఉన్న వివరాలు అందజేయాలంటూ రేవంత్ కు ఇచ్చిన నోటీసుల్లో సిట్ పేర్కొంది.

Leave a Reply