Suryaa.co.in

Telangana

22న అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి

– ఎండోమెంట్ కమిషనర్ ను కోరిన విశ్వహిందూ పరిషత్

అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిర ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. గురువారం దేవాదాయ శాఖ తెలంగాణ కమిషనర్ అనిల్ని కలిసి విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం వినతి పత్రం సమర్పించింది.

అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రారంభం… బాల రాముడి ప్రాణప్రతిష్ట చేస్తున్న శుభ సందర్భంగా.. రాష్ట్రంలోని ప్రతి మందిరం శుద్ధి చేసి, అందంగా ముస్తాబు చేయాలని వారు కోరారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట చేసే శుభ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదం వితరణ చేయాలని, అదేవిధంగా దేవాలయ కేంద్రంగా ఎల్ఈడీలు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ఉదయం నుంచి రాత్రి వరకు దేవాలయాలు తెరిచి ఉంచి, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత భక్తిశ్రద్ధలతో దీపారాధన నిర్వహించాలని సూచించారు. మేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా సర్కులర్ జారీ చేయాలని వారు కమిషనర్ ను కోరారు.

అయితే కమిషనర్ అనిల్ స్పందిస్తూ.. వెంటనే రాష్ట్ర దేవాదాయ మంత్రివర్యులకు సమాచారం చేరవేసి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ , ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , ప్రచార ప్రముఖ్ శ్రీ పగుడాకుల బాలస్వామి , బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు , బజరంగ్ దళ్ రాష్ట్ర కో- కన్వీనర్ జీవన్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE