శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు సోమవారం అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేని విధంగా ప్రముఖుల సమాచారం ముందుగానే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు కోరారు

సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దసరా ఏర్పాట్లపై క్యూలైన్లోని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు తొలిరోజు అరగంటలోపుగా దర్శనం పూర్తవుతుందన్నారు. సామాన్య భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలగకుండా వీవీఐపీల1 సమాచారం ముందుగా తెలియజేస్తే ప్రోటోకాల్ కు ఇబ్బంది ఉండదు అని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఓంకారం సెంటర్ మార్గం నుండి వివిఐపీలను పైకి తీసుకురావడం జరుగుతుందని, అదే మార్గం నుండి వికలాంగులకు కూడా తీసుకు రావడం జరుగుతుందన్నారు . అక్టోబర్ 2 నుంచి 5వ తేదీల వరకు భక్తులు సంఖ్య పెరుగుతుందని, సుమారు రెండు నుండి రెండున్నర లక్షల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తేనే శరన్నవరాత్రులను విజయవంతం చేయగలమన్నారు. భక్తుల రద్దీని ఎలా నియంత్రించవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం ఎలా చేయించవచ్చు అనే విషయాలపై మీడియా, పోలీస్, పబ్లిక్ అందరూ సలహాలు ఇవ్వాలని కోరారు. చిన్న, చిన్న సంఘటనలు, విమర్శలు లేనివిధంగా దసరా ఉత్సవాలు పూర్తి చేయడానికి ప్రీతీ ఒక్కరూ సహాయసహకారాలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు :-
1. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన.22. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి  కొట్టు సత్యనారాయణ.
3. మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు.
4. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.
5. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా10హై కోర్టు జడ్జీలు :-
6. జస్టిస్ డి. రమేష్,
7. జస్టిస్ ఆర్. రఘునందన రావు.
8.జస్టిస్ డి. సోమయాజులు.
9.జస్టిస్ కె. విజయలక్ష్మి.

అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక సమయం కేటాయింపు….. డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.

ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునే వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు రేపటి మంగళవారం ఉదయం 10:00 గంటలు నుంచి 12:00 గంటలు వరకు, సాయంత్రం 4:00 గంటల నుంచి 6:00 గంటల వరకు నగరంలోని మోడల్ గెస్ట్ హౌస్ నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.వీరిని బస్సులలో అమ్మవారి దర్శనం చేయించి మళ్ళీ వారిని అక్కడికి తీసుకు రావడం జరుగుతుందన్నారు. వృద్ధులు ,విభిన్న ప్రతిభావంతులు ఎటువంటి టికెట్స్ కొనవలసిన అవసరం లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

Leave a Reply