గుంటూరు: ఐదు జిల్లాల పరిధి మేరకు ( పశ్చిమ గోదావరి నుండి నెల్లూరు వరకు )విస్తరించి వున్న సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్కు నూతన కమిషనర్గా సుజిత్ మల్లిక్ మంగళవారం గుంటూరు కన్నావారితోట లోని జీఎస్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఆయన భువనేశ్వర్ నుండి గుంటూరుకు ప్రమోషన్ పై వచ్చారు.సుజిత్ మల్లిక్ రూర్కెలాలోని ఆర్.ఈ.సి (ప్రస్తుతం ఎన్ఐటీ) నుండి బీఈ (మెకానికల్ ఇంజినీరింగ్)ను 1997-2001 సంవత్సరాల్లో పూర్తి చేశారు. ఒడిశాలోని ఆంగుల్లో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్లో పనిచేశారు. ఆయన 2007లో ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)లో చేరారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కొటిక్స్ (నాసెన్), ఫరీదాబాద్లో ప్రొబేషన్ ట్రైనింగ్ పూర్తి చేసిన అనంతరం, ఆయన మొదటి పోస్టింగ్ కోల్కతాలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్, ఎన్ఎస్సీబీఐ ఎయిర్పోర్ట్లో అసిస్టెంట్ కమిషనర్గా చేరారు. అక్కడ ఆయన ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ఎస్ఐఐబీ, డ్రాబ్యాక్ వంటి విభాగాలను చూసారు.
తరువాత కోల్కతాలోని కస్టమ్స్ హౌస్లో అసిస్టెంట్ కమిషనర్ (పర్సనల్ & విజిలెన్స్)గా పని చేశారు. ఆ తర్వాత కోల్కతా సర్వీస్ టాక్స్ విభాగంలో డెప్యూటీ కమిషనర్గా పనిచేశారు. అనంతరం కోల్కతా-II సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్లో పనిచేశారు. డిజిసీఈఐ, కోల్కతాలో డెప్యూటీ డైరెక్టర్గా వ్యవహరించారు. 2017లో జాయింట్ కమిషనర్గా పదోన్నతి పొంది పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కస్టమ్స్ లో పనిచేసారు.
జీఎస్టీ అమలుకు ముందు, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లతో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల కంప్యూటరైజేషన్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
2019 నుండి 2022 వరకు, ఒడిశా ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జాయింట్ సెక్రటరీగా డిప్యుటేషన్పై పనిచేశారు. ఒడిశా ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ, బిపిఒ పాలసీ రూపకల్పనలో చురుకుగా పాల్గొన్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ కు (సీబీఐసీ) తిరిగి వచ్చిన అనంతరం, ఆయన భువనేశ్వర్ జోన్లో జీఎస్టీ కస్టమ్స్ విభాగాల్లో పనిచేశారు. వివిధ విభాగాలలో సేవలందిస్తూనే, ఆయన సైబర్ లా & సైబర్ ఫోరెన్సిక్స్లో పీజీ డిప్లొమా పొందారు. అంతేకాక, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ద్వారా అక్రమ వన్యప్రాణుల వాణిజ్యంలో నిపుణునిగా గుర్తింపు పొందారు.