Suryaa.co.in

Telangana

మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయండి

– రెడ్లను దూషించారు.. చర్య తీసుకోండి
– పోలీసులకు రెడ్డి సంఘం ఫిర్యాదు

హైదరాబాద్: రెడ్లను బహిరంగంగా దునుమాడిన కాంగ్రెస్ బీసీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన రెడ్డి సంఘం.. తమ కులాన్ని దూషించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమయింది.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని దూషించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ లో తీన్మార్ మల్లన్న బీసీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డి సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెడ్డి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్లను కుక్కలతో పోల్చుతూ దూషించారని మండిపడుతున్నారు. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కలిసి కోరారు.

LEAVE A RESPONSE