Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డిపై వేటు

– సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వు
-వైసీపీకి ప్రచారం చేశారన్నదే సస్పెండ్‌కు కారణం
– ఎట్టకేలకూ ఈసీ ఆదేశాలు పాటించిన సర్కారు

విజయవాడ: వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ, ఆ పార్టీకి ఉద్యోగులు ఓటు వేయాలని కోరుతూ పట్టుబడ్డ సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డిని జగన్ ప్రభుత్వం ఎట్టకేలకూ సస్పెండ్ చేసింది. ఆయనను సస్సెండ్ చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. నిజానికి వైసీపీ సేవలో తరిస్తున్న వెంకట్రామిరెడ్డిపై చర్య తీసుకోవాలని ఈసీ, చాలారోజుల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అయినా ఇప్పటివరకూ చర్యలు తీసుకోని సీఎస్ జవహర్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరిపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. దానితో ఎట్టకేలకూ గురువారం సాయంత్రం వెంకట్రామిరెడ్డిని, సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం అనివార్యమయింది. ఎన్నికలయ్యే వరకూ హెడ్‌క్వార్టర్ దాటకూడదని ఆదేశించింది.

LEAVE A RESPONSE