తాడేపల్లి క్రైం హబ్ గా మారిపోయింది

తాడేపల్లి దివ్యాంగురాలు ఎస్తేర్ రాణి హత్యపై నేషనల్ ఎస్సీ కమీషన్ లో పిర్యాదు చేసిన తెదేపా నేత వర్ల రామయ్య

• తాడేపల్లిలో సిఎం నివాసం, డీజీపీ ఆఫీసులు ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ కరువయ్యింది.
• డ్రగ్స్ తో ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
• పోలీసుల ఉదాసిన వైఖరితో తాడేపల్లిలో గతంలో అనేక దారుణమైన సంఘటనలు జరిగాయి.
• ఫిబ్రవరి 12 న నిందితుడు దివ్యాంగురాలు ఎస్తేర్ రాణిని చిత్రహింసలకు గురిచేశాడు.
• భాధితురాలి తల్లి నింధితుడి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
• ఇంతలోనే రాజు దివ్యాంగురాలిపై దాడిచేసి తలపై కత్తితో నరికాడు.
• హాస్పిటల్ కు తీసుకెళ్లే క్రమంలో దివ్యాంగురాలు మృతిచెందింది.
• నిందితుడు రాజు నేరచరిత్ర ఉన్నవాడు.
• పోలీసుల ఉదాసీన వైఖరే దివ్యాంగురాలి హత్యకు కారణం.
• నిందితుడు రాజు డ్రగ్స్ కు బానిసైనట్లు తెలుస్తోంది.
• డ్రగ్స్ దందాపై అనేక మార్లు పిర్యాదులు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
• దివ్యాంగురాలిని అత్యంత దారుణంగా హతమార్చిన రాజుపై కఠిన చర్యలు తీసుకోండి.
• ఏపీ ప్రభుత్వం డ్రగ్స్ నిషేదం పై చర్యలు తీసుకునేలా కమీషన్ ఆదేశించండి.
• డ్రగ్స్ ప్రభావంతో మహిళలపై జరిగిన నేరాలపై సమగ్ర విచారణ చేయించండి.
• రాష్ట్రంలో శాంతిభద్రతలను ఖూనీ చేస్తూ తప్పుడు మార్గంలో నడుస్తున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోండి.
• భాధితురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోండి.

Leave a Reply