– కూటమిగా ఏర్పడటం శుభపరిణామం
– సీఎం రమేష్, పంచకర్ల రమేష్లను గెలిపించండి
– మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్లే చాలాకాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. అనకాపల్లి లోక్సభ ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ ఈ వ్యాఖ్యలు చేశారు. వారిద్దనిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తమ్ముడు కారణంగా చాలాకాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం అందరూ మంచి కూటమిగా ఏర్పడ్డారు. ఇది శుభపరిణామం…సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రుడు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ ఇద్దరు నాకు కావాల్సిన వారు… ఇద్దరూ మంచివాళ్లే కాకుండా సమర్థులు. నియోజకవర్గాల అభివృద్ధికి దోహదపడతారు. ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
కేంద్రంతో సీఎం రమేష్కు ఉన్న పరిచయాలు అనకాపల్లి లోక్సభ స్థానం అభివృద్ధికి ఎంతగానో ఉపయో గపడతాయి. తద్వారా పంచకర్ల రమేష్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కోరుకునే అభివృద్ధి పనులు సజావుగా జరుగుతాయి. అందరి ఆశీస్సులు వీరిపై ఉంటాయని నమ్ముతున్నాను. దయచేసి వీరిద్దరిని గెలిపించండి. నాదో పెద్ద కోరిక. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలి. దానికి మీరందరూ నడుం బిగించండి. ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించి మీ ఆశీస్సులు అన్ని విధాలుగా వీరికి ఉన్నాయనే నమ్మకాన్ని మాకు కలిగించండి అని విజ్ఞప్తి చేశారు. పంచ కర్ల రమేష్ తన దీవెనలతోనే రాజకీయ అరంగేట్రం చేశారని, ఎక్కడ ఉన్నా తనతో మాట్లాడు తూనే ఉంటారని వెల్లడిరచారు.