Suryaa.co.in

Andhra Pradesh

5న బలహీనవర్గాల సమక్షంలో టీడీపీ బీసీ ప్రత్యేక డిక్లరేషన్

• జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో దారుణంగా దెబ్బతిన్న బీసీలను రాజకీయంగా..సామాజికంగా..ఆర్థికంగా..విద్యపరంగా తిరిగి ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే చంద్రబాబు ఆలోచన
• బీసీల అభిప్రాయాలు..చంద్రబాబు ఆలోచనల కలగలుపు టీడీపీ ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్
• బీసీ డిక్లరేషన్ రూపకల్పనకు యనమల రామకృష్ణుడి నేత్రత్వంలో టీడీపీ 15 మంది సభ్యుల కమిటీని నియమించింది
• బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు… బీసీకులగణన సహా పలు అంశాల్ని డిక్లరేషన్లో ప్రకటించనున్నాం
• జయహో బీసీ డిక్లరేషన్ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచీ బీసీలు భారీసంఖ్యలో తరలిరావాలి. బీసీ సోదరుల నినాదాలతో తాడేపల్లి ప్యాలెస్ కంపించాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

బలహీన వర్గాల అభ్యున్నతి, రక్షణే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ‘జయహో బీసీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిందని, దానిలో భాగంగా బీసీల కోసం టీడీపీ ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించనుందని, ఈ నెల 5వ తేదీన మంగళగిరి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహించే బీసీ మహా సభలో టీడీపీ జాతీయఅధ్యక్షులు చంద్రబాబునాయుడు డిక్లరేషన్ ప్రకటిస్తారని, రాష్ట్రం నలుమూలల నుంచి భారీసంఖ్యలో బీసీ సోదర, సోదరీమణులు హాజరై బీసీమహాసభను విజయవంతం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన పలువురు బీసీనేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“బలహీనవర్గాలతో మమేకమై… వారి కష్టసుఖాలు తెలుసుకొని వారికి ఏం చేయాలో .. ఏంచేస్తే వారు ఆర్థికంగా..సామాజికంగా..రాజకీయంగా ఎదగగలరో ఆలోచించిన తర్వాతే టీడీపీ తరుపున బీసీలకు ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించబోతు న్నాం. టీడీపీ ప్రకటించే బీసీ డిక్లరేషన్ స్వయంగా బలహీనవర్గాలు తయారుచేసు కున్నదే. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు మంచి గుర్తింపు వచ్చింది అనేది కాదనలేని వాస్తవం.

ఆనాడు ఆ మహానుభావుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాలకు 24శాతం రిజర్వేష న్లు కల్పించారు. బీసీ విద్యార్థులకోసం రెసిడెన్షియల్ పాఠశాలలు..గురుకుల పాఠ శాలలు ఏర్పాటు చేశారు. ఆయన బాటలోనే చంద్రబాబునాయుడు బీసీల్ని రాజకీయంగా మరింత పైకి తీసుకురావాలనే సదుద్దేశంతో రిజర్వేషన్లను 34శాతా నికి పెంచారు. ఆదరణ పథకం తీసుకొచ్చి, బీసీ యువతకు ఆర్థికంగా అండగా నిలిచారు. బీసీ విద్యార్థులు..యువతకు అనేక పథకాలు అమలుచేశారు.

జగన్ అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం బీసీలకు అమలు చేసిన 30కి పథకాలు రద్దు చేశాడు
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో బీసీలకు అమలుచేసిన అన్ని పథకాల్ని రద్దుచేశారు. దాదాపు 30కి పైగా బీసీల పథకాల్ని రద్దు చేయడమే గాక, బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈ ప్రభు త్వాన్ని ప్రశ్నించారన్న అక్కసుతో ఈ ముఖ్యమంత్రి ఎందరో బీసీలను పొట్టన పెట్టుకున్నాడు. తెలుగుదేశం పక్షాన నిలుస్తున్నారన్న అక్కసుతో బీసీలపై కక్ష కట్టిన జగన్ రెడ్డి… టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడినే తప్పుడు కేసుల తో జైలుకు పంపాడు.

నాపై..అయ్యన్నపాత్రుడిపై…యనమల రామకృష్ణుడిపై తప్పుడు కేసులు పెట్టి వేధించాడు. గ్రామ..మండలస్థాయి బీసీ నాయకు ల్ని…కార్యకర్తల్ని కిరాతకంగా చంపించాడు. 57 నెలల జగన్ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం.. వంచన మాటల్లో వర్ణించలేనిది. ఇవన్నీ సాటి బీసీ సోదరుల కు తెలియచేసి, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా బీసీ నాయకుల అభిప్రాయాలు సేకరించి, వారి ఆలోచనలు తెలుసుకున్నాం. మండలస్థాయిలో 850 జయహో బీసీ సమావేశాలు నిర్ణయించాం. ఆ సమావేశాలకు హాజరైన ప్రతి బీసీసోదరుడి అభిప్రాయం తెలుసుకున్నాం.

టీడీపీ సీనియర్ నాయకుడు..మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేత్రత్వంలోని 15 మంది సభ్యుల కమిటీ బీసీ డిక్లరేషన్ రూపొందించింది
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బీసీవిభాగం నిర్వహించిన జయహోబీసీ కార్యక్ర మానికి బలహీనవర్గాల నుంచి అనూహ్యమైన స్పందన వ్యక్తమైంది. సదరు కార్యక్రమం ద్వారా తెలుసుకున్న అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన టీడీపీ బీసీ డిక్లరేషన్ కోసం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేత్రత్వంలో 15 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ వేసింది.

సదరు కమిటీ రూపొందించిన ప్రత్యేక బీసీ డిక్లరేషన్ ను 5వ తేదీన చంద్రబాబు ప్రకటిస్తారు. రాష్ట్రస్థాయిలో బీసీలకు ఏం చేయాలనే విషయాలతో పాటు.. జాతీయస్థాయిలో బలహీనవర్గాల అందాల్సిన చేయూత వివరాల్ని కూడా డిక్లరేషన్లో ప్రకటించబోతున్నాం. ఈ డిక్లరేషన్ ప్రకట నకు విచ్చేయుచున్న చంద్రబాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.

5వ తేదీన నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు జయహో బీసీ డిక్లరేషన్ మహా సభ సభలో బీసీ సోదరులు చేసే నినాదాలతో తాడేపల్లి ప్యాలెస్ కంపించాలి
5న మంగళగిరి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉ న్న బహిరంగప్రదేశంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే జయహో బీసీ డిక్లరేషన్ మహాసభకు బీసీలంతా ప్రభంజనంలా తరలిరావాలని కోరుతున్నాం. బీసీల నినాదాలతో తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోవాలి. డిక్లరేషన్లో ప్రధానంగా 6 నుంచి 7 అంశాలున్నాయి. బీసీల్లోని అన్నివర్గాలకు అండగా నిలిచేలా టీడీపీ బీసీ డిక్లరేషన్ ఉంటుంది.

అలాగే మా పార్టీ తరుపున ఎస్సీ డిక్లరేషన్..ఎస్టీ డిక్లరే షన్ కూడా ఉంటాయి. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు.. ఎన్నికల కోసం జగన్ రెడ్డి చేస్తున్న బీసీ కులగణన మాదిరి కాకుండా…బీసీలకు ఉపయోగపడేలా, వారు మెచ్చేలా చిత్తశుద్ధితో టీడీపీ ప్రభుత్వం కులగణన ఎలా చేపట్టనుందో కూడా డిక్లరేషన్ ద్వారా ప్రకటిస్తాం.” అని రవీంద్ర తెలిపారు

LEAVE A RESPONSE