రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్ముకు టిడిపి మద్ధతు

-ఈ రోజు జరిగిన స్ట్రాటజీ కమిటీలో నిర్ణయం
– నారా చంద్రబాబు నాయుడు

గతంలో కూడా కె.ఆర్. నారాయణన్, ఏ.పి.జె. అబ్దుల్ కలాం గార్లలను టిడిపి బలపరిచింది. అలాగే లోక్ సభ స్పీకర్ గా బాలయోగిని, శాసనసభ స్పీకర్ గా ప్రతిభా భారతి గార్లను టిడిపి చేసింది. కేంద్ర మంత్రిగా కింజారపు ఎర్రంనాయుడుని చేయడం ద్వారా తెలుగుదేశం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిందని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా తెలుగు బిడ్డ పి.వి. నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచింది. ఈ విధంగా తెలుగు వారి కోసం, సామాజిక న్యాయం కోసం టిడిపి ముందు వరుసలో నిలబడిందని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply