రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా పండుగ

  • 15వ తేదీన గుంటూరు చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో హర్ ఘర్ తిరంగా వేడుకలు
  • 15న ఉదయం 8.30 గంటలకు గుంటూరులో జాతీయ జెండా ఆవిష్కరించనున్న చంద్రబాబు నాయుడు

అమరావతి: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుపనున్నారు. 15న గుంటూరు స్తంబాలగరువు మెయిన్ రోడ్డు లోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే ఆజాదీకా అమృత్ వేడుకల్లో ఉదయం 8.30 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన బహిరంగసభలో ప్రసంగిస్తారు. 13, 14, 15 తేదీలలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త తమ ఇళ్లపై మువ్వన్నెల జాతీయ జెండాలు ఎగురవేయాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. దేశంపై తమ బాధ్యతను, దేశభక్తిని చాటాలని పేర్కొన్నారు. 15న గుంటూరులో జరిగే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తమ వాహనాలకు (పార్టీ జెండాలతో కాకుండా) జాతీయ జెండాలను మాత్రమే కట్టుకుని రావాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

Leave a Reply