జె-బ్రాండ్స్ నిషేధంపై టిడిపి నిరసనలు

– ఈ నెల 19,20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు టిడిపి నిర్ణయం
– అసెంబ్లీ లో ఎమ్మెల్యేల పోరాటానికి మద్దతుగా ప్రజలతో కలిసి గ్రామ స్థాయి నిరసనలు

అమరావతి: రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, మద్యం షాపుల్లో జె బ్రాండ్స్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ టిడిపి నిరసనలు తలపెట్టింది. జంగారెడ్డి గూడెం మరణాలపై ఇప్పటికే అసెంబ్లీలో పోరాటం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం….రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ సారా, మద్యం షాపుల్లో జె- బ్రాండ్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది.

వచ్చే శనివారం, ఆదివారం(19,20 తేదీల్లో) రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మండల కేంద్రాలలో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టనున్నారు. జంగారెడ్డి గూడెం మరణాలు సహజ మరణాలు అంటూ సభను సైతం తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను టిడిపి తప్పు పడుతోంది. మరోవైపు నాణ్యత లేని, కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు పోవడంతో పాటు జనారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని…వీటిని వెంటనే నిషేధించాలనే డిమాండ్ తో టిడిపి నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.

కల్తీ సారా, నాణ్యత లేని జె బ్రాండ్స్ మద్యం తో మహిళల తాళిబొట్లు తెంపేస్తున్నారని….ఇంత జరుగుతున్నా కమీషన్ల కోసమే జగన్ సర్కార్ పనిచేస్తుందని టిడిపి ఆరోపిస్తుంది. కల్తీ సారా, జె బ్రాండ్స్ పై అసెంబ్లీలో ఎమ్మెల్యేల పోరాటానికి మద్దతుగా వాడవాడలా యుద్దానికి టిడిపి సిద్దం అయ్యింది.

Leave a Reply