Suryaa.co.in

Telangana

క్రైస్తవ మతమార్పిడి మాఫియా కేంద్రాలుగా తెలంగాణా ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు

– వీహెచ్‌పి జాతీయ అధికార ప్రతినిధి డా. రావినూతల శశిధర్

హైదరాబాద్ : తెలంగాణా రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల కేంద్రంగా నడుస్తున్న క్రైస్తవ మతమార్పిడి మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు టిజిఆర్‌జేసీ సెక్రెటరీ సీహెచ్ రమణ కుమార్ ని కలిసి వీహెచ్‌పి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

హనుమకొండ జిల్లా పరిధిలోని హాసన్ పర్తి కళాశాలలో ఫ్రిన్సిపల్ ఇందుమతి మతమార్పిడి మాఫియాను కొనసాగిస్తున్నారని, విద్యార్థినులను వేధింపులకు మరియు ప్రలోభాలకు గురిచేసి మతం మారుస్తుందని, బాలికల రెసిడెన్షియల్ కళాశాలలోకి బయటి నుండి క్రైస్తవ ఫాదర్ లను రప్పించి మతమార్పిడి జరిపిస్తున్నారని రమణకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు.

21 సంవత్సరాలుగా ఒకే దగ్గర తిష్ఠవేసిన ఫ్రిన్సిపల్ ఇందుమతి వ్యవస్థలన్నింటిని తనకు అనుకూలంగా మలచుకొని, హసన్ పర్తి బాలికల రెసిడిన్షియల్ కళాశాలను చర్చిగా మార్చిందని, మతం మారడానికి ఇష్టపడని విద్యార్థినులపై జరుగుతున్న వేధింపులు బరించలేక అనేకమంది విద్యార్థినులు తమ చదువులు మధ్యలోనే వదులుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.

ఫ్రిన్సిపల్ భౌతిక వేధింపుల కారణంగా విద్యార్థినులు తీవ్ర భయంలో ఉన్నారని కార్యదర్శి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. పై విషయాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోల సాక్ష్యాలను సెక్రటరి కి సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి టిజిఆర్‌జేసీ కేంద్రంగా సాగుతున్న మతమార్పిడులు అరికట్టాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైతే వీహెచ్‌పి ప్రత్యక్ష కార్యచరణకు సిద్దమవుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE