– రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ సమస్యలు 7 నెలల్లోనే పరిష్కరించాం
– అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సంక్షేమం, అభివృద్ధే మన లక్ష్యం
– క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలను బలోపేతం అవసరం
– సభ్యత్వ నమోదులో పార్టీ చరిత్ర సృష్టించింది
– కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలి
– ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఇంటింటికి వెళ్లి నేతలు వివరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. తెలుగుదేశం పార్టీ విశాఖ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, నాయకులతో లోకేష్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు సంస్థాగత అంశాలపై దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలను బలోపేతం చేయడంపై నేతలు దృష్టిసారించాలి. కోటికి పైగా సభ్యత్వ నమోదుతో పార్టీ చరిత్ర సృష్టించింది. కార్యకర్తలకు అన్ని విధాల అండగా నిలవాలి. పార్టీ సుప్రీం. పార్టీ వల్లే ఈ స్థాయిలో ఉన్నామని నాయకులు గుర్తుంచుకోవాలి. పార్టీ వల్లే నేను యువగళం పాదయాత్ర చేయగలిగా. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ సహకరిస్తున్నారు.
ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న కసి ఉండాలి. ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి లోకేష్ నేతలకు దిశానిర్దేశం చేశారు. రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు ఏడు నెలల్లోనే పరిష్కరించాం.
అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఉతరాంధ్ర జిల్లాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.