Suryaa.co.in

Sports Telangana

ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్, పివైఎల్ నిరసనలకు దిగింది. అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో టికెట్ల విషయంలో బ్లాక్ దందా కొనసాగు తుందని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సత్య ప్రసాద్ ఆరోపించారు.ఈ సందర్భంగా సత్య ప్రసాద్ మాట్లాడుతూ, కేవలం 20 నిమిషాల వ్యవధిలో 70 వేల టికెట్లు ఏ విధంగా అమ్ముడు పోతాయని ప్రశ్నించారు. దీంతో, క్రికెట్ అభిమానులు తమకు టికెట్లు దొరకక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి, ఏప్రిల్ 25న జరిగే క్రికెట్ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE