Suryaa.co.in

Andhra Pradesh

తులసితో పార్టీకి సంబంధం లేదన్న పల్లాకు కృతజ్ఞతలు

– గుడివాడ ప్రజలకు ఇప్పుడే అసలైన దీపావళి
– డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు

అమరావతి: తన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబుకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదు. పార్టీలో తులసిబాబుకు ఎలాంటి పదవులు లేవంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ విషయంలో పార్టీ త్వరితగతిన స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని రఘురామ పేర్కొన్నారు. ఇక నుంచి గుడివాడలో జై తులసిబాబు అనే నినాదాలు, బ్యానర్లు ఉండవు, ఉండకూడదు అని అన్నారు.

పల్లా ప్రకటనతో గుడివాడ ప్రజలు నిజమైన దీపావళి వచ్చినట్టు భావిస్తున్నారని, పల్లా ప్రకటన వెలువడిన గంటలోనే నాకు గుడివాడ నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్లు వచ్చాయి అని వెల్లడించారు. తులసిబాబుకు టీడీపీతో సంబంధం లేదన్న విషయం తెలియడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

LEAVE A RESPONSE