Suryaa.co.in

Andhra Pradesh

ఆ అనుభూతి చిరకాలం గుర్తుంటుంది: చంద్రబాబు

వాజ్‌పేయ్ కి చంద్రబాబు ఘననివాళులు

భారతరత్న వాజ్‌పేయ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ “భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నా. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తూ సగర్వంగా తలెత్తుకు నిలబడుతోంది.

‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి అర్పిస్తున్నా” అంటూ సీఎం ట్వీట్ చేశారు.

LEAVE A RESPONSE