ఎంపి విజయసాయిరెడ్డి
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో బాగంగా శుక్రవారం నుండి సీఎం సైనికులుగా పార్టీ పదాతీదళం ప్రతి ఇంటికి వెళ్లనుందని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయరెడ్డి అన్నారు.ఈ మెరకు 175 నియోజికవర్గాల్లో ఏడు లక్షల మందితో వైఎస్ఆర్ సిపి పదాతీదళం ప్రతి ఇంటికి వెళ్లడం ద్వారా ఐదు కోట్ల మంది ప్రజలతో మమేకం కానున్నారని చెప్పారు.ఐదు ప్రశ్నలతో ప్రజా మద్దతు పుస్తకంలో వివరాలు నమోదు చేయ్యనున్నారని వెళ్లడించారు.
వైద్య ఆరోగ్య చరిత్రలో గొప్ప మార్పునకు శ్రీకారం
సామాన్యుడికి వైద్యం అందించటంలో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఒక గొప్ప మార్పునకు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం పూర్తి స్థాయిలో అమలు కావడం ద్వారా గ్రామంలో ఇంటి ముంగిటికే అన్ని వైద్య సేవాలు అందనున్నయాని చెప్పారు.మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్యం అందనుందని,ఖర్చలకు వెనకాడకుండా విప్లవాత్మక కార్యక్రమానికి ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఈ మేరకు పలు అంశాలపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు..