– కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రతి ఇంటికి ప్రచారం చేయండి
– ప్రజా భవన్ లో బిసి నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: ఈ దేశంలో ఇప్పటివరకు బీసీ జన గణన సైంటిఫిక్ గా తేల్చలేదు. మొదటిసారి తేల్చింది తెలంగాణ ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసి జనగణనను ఏ సర్వే తోనూ పోల్చలేరు. 2011లో జరిగిన జన గణన లో కేవలం ఎస్సీ, ఎస్టీ, ఇతర జనాభా లెక్కలే తేల్చారు.
కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అధికారికం కాదు. దానిని క్యాబినెట్ లో పెట్టలేదు, శాసనసభలో చర్చకు పెట్టలేదు. కాబట్టి అది చెల్లుబాటు కాదు. దేశంలో మొదటిసారి బీసీ జనాభాను అధికారికంగా లెక్క తేల్చి ముద్ర వేశాం. దీనిని ఆయా వర్గాల ప్రయోజనం కోసం ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేది బీసీ ప్రజా ప్రతినిధులు, సంఘాలు ఆలోచన చేయాలి.
బీసీ సర్వే అధికారికంగా జరగడం మూలంగా టిఆర్ఎస్ కు నష్టం. కాబట్టి సర్వే బాగాలేదని ప్రచారం చేసి బీసీ లబ్ధిదారులకు ప్రయోజనం దక్కకుండా ఆ పార్టీ రాజకీయం చేస్తుంది. తెలంగాణలో బీసీ సర్వే విజయవంతం అయితే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుంది. బీజేపీ పై ఒత్తిడి పెరుగుతుందని ఆ పార్టీ నేతలు సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి ఉన్నప్పటికీ. రాహుల్ గాంధీ నా నాయకుడు ఆయన ఏ జెండానే నా ఎజెండా. నాకు వచ్చిన ఉద్యోగాన్ని సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. వారికి నా అభినందనలు. సర్వే పారదర్శకంగా జరగాలని, ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని, ఎక్కడ రాజీ పడవద్దని ప్రణాళిక శాఖ చూస్తున్న నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు.
సర్వేపై ఎవరు ఏ ప్రశ్న అడిగినా అధికారికంగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని ఆధారాలు అధికారికంగా నిక్షిప్తం చేశాం. 8 కోట్ల పేజీలకు పైబడిన సమాచారం సర్వే ద్వారా సేకరించాం.