చరిత్రలో చెబుతున్న..చెప్పబడుతున్న పెద్ద పెద్ద అబద్ధాలు

రెండు తూటాలు తగిలిన తరువాత గాంధీ ‘హే రామ’ అని అన్నాడు.
పచ్చి అబద్ధం!
– తూటాలు తగలగానే గాంధీ నోటి నుండి ఏ పదము రాలేదు.
నెహ్రూకి పిల్లలంటే చాలా ప్రేమ.
nehru-displyపచ్చి అబద్ధం!
– నెహ్రూకి పిల్లలంటే కాదు, స్త్రీలంటే చాలా ప్రేమ. విశేషించి విదేశీ మహిళలంటే.
“దే దీ హమేం ఆజాదీ బినా ఖడ్గ బినా ఢాల” [అర్థం- మాకు కత్తి, డాలు లేకుండానే స్వతంత్రం తెచ్చి పెట్టాడు- అని గాంధీ అహింస సిద్ధాంతం గురించి ఆ పాట. ఇదొక జాగృతి (1954) అనే హిందీ సినిమా గీతం]
బొత్తిగా వెర్రితనం.
– 1857లో భారతీయులు ప్రథమ స్వతంత్ర సంగ్రామం ప్రారంభించారు. 1947 వరకు 7 లక్షల 32 వేల భారతీయులు ప్రాణాలు అర్పించారు. అప్పుడు స్వతంత్రం వచ్చింది.
“ఏ మేరే వతన కే లోగో, జరా ఆంఖ్ మే భర్ లో పానీ” అనే (కవి ప్రదీప్ వ్రాసిన హిందీ దేశభక్తి గీతం, లతా మంగేష్కర్ గానం చేసింది. అర్థం- ఓ నా దేశవాసులారా, కాస్త కళ్ళలో నీరు నింపుకోండి…) పాట విని నేహ్రూ ఏడ్చేశాడు.
వీర అబద్ధం.
– నెహ్రూ భారత దేశపు ఆయుధాల కార్ఖానాలను మూయించాడు, చైనాను శక్తివంతంగా చేయించాడు, పరమాణుశక్తిగా తీర్చిదిద్దాడు, సంసద్ భవనంలో కూడా 1962 తరువాత నెహ్రూ ఇట్లా అన్నాడు- ఏమైంది, మానస సరోవరం పోతే? అది బంజర భూమి, గడ్డిపోచ కూడా అక్కడ పెరగదు. అని.
అక్బర్ గొప్పవాడు.
అసలు సిసలు అబద్ధం.
– అక్బర్ ఒక విదేశీ ఆక్రమణకారుడు, పూర్తిగా కామాంధుడు, మహారాణా ప్రతాప్ అంటే భయపడేవాడు, అందువల్లే హల్దీఘాట్ యుద్ధానికి రాలేదు.
“మజహబ్ నహీ సిఖాతా, ఆపస్ మేఁ బైర్ కరనా” (మహ్మద్ ఇక్బాల్ వ్రాసిన ‘సారే జహాఁ సే అచ్ఛా’- అనే పాటలో చరణం. అర్థం- మతం నేర్పదు, పరస్పరం వైరం పెట్టుకోమని)
భయంకరమైన అబద్ధం.
– మతం పేరు మీదే ఇస్లాము అనుయాయులు కశ్మీర్ నుండి హిందువులను వెళ్ళగొట్టారు. మతం పేరు మీదే దేశాన్ని విభజింపచేశారు, 30 లక్షల హత్యలు బాహాటంగా చేశారు.
“హిందూ ముస్లిము ఇసాఈ- పర్సపరం భాయీ భాయీ.
పూర్తిగా అబద్ధం.
– భాయి భాయీ అయితే – ఇతరులకు తల్లితో సమానమైన ఆవును ఒక భాయీ కోసి తినే పని ఎందుకు చేస్తున్నాడు? కాశ్మీర్ నుండి హిందువులను ఎందుకు వెళ్ళగొట్టారు!?
“గంగా- జమనా తహ్ జీబ్ (సంస్కృతి)
తీయని అబద్ధం
– నిజమేంటంటే గంగ కూడా హిందువులదే, యమునా నది కూడా హిందువులదే. యమునా నది ఎప్పటినుంచి ఇస్లామిక్ నది అయిపోయిందిటా?
గాంధీ అహింస పూజారి.
మహా అబద్ధం
– గాంధీ హిందువు మహిళలను బలాత్కారాలను సహించమని చెప్పాడు. హిందువులతో ఏమో- ముస్లిములు చంపేస్తే చచ్చిపోండి- అని అన్నాడు. కానీ ఎప్పుడూ ముస్లిములకు మాత్రం హిందువులను చంపవద్దని చెప్పలేదు.
నెహ్రూ పండిత్ (బ్రాహ్మణుడు)
చెల్లని అబద్ధం
– నెహ్రూ గయాసుద్దీన్ గాజీ అనే అఫ్ఘానిస్తాన్ దేశం వాడి వంశంవాడు, నెహ్రూకు ముబారిక్ అలీ తో కూడా సంబంధాలు ఉన్నాయి, “నెహ్రూ” అనే సరనేమ్ (ఇంటి/కుటుంబం పేరు) కూడా తప్పుడుదే। బ్రహ్మాండంలో ఏ బ్రాహ్మణునికీ ఈ సరనేమ్ లేదు.
వామపక్షాల వారు, కాంగ్రెసు వారు , సెక్యులర్, జిహాదీయులు ఈ అబద్ధాలను ఈనాటి వరకూ మనకు వండి వడ్డించారు. మనం ఈ అబద్దాల గుంటలో పడ్డాము. కానీ వచ్చే తరాలు ఈ అబద్దాలన్నింటి పట్ల సావధానంగా ఉండాలి.
70 సం వ రాలు అన్ని అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, నేటికి ఇంకా అబద్ధాల్లోనే ప్రజలను వుంచి పరిపాలించాలని అనుకుంటుంది.
నిజాలు తెలుసుకోండి. కాంగ్రెస్ ఒక్క దేశ విరోధి రాజకీయ పార్టీ.

ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన నిజాలు

దేశ వినాశనంలో ముస్లింలీగ్ (మహమ్మద్ ఆలీ జిన్నా) గాంధీ కుటుంబం
20వ శతాబ్ద ప్రథమార్థ భాగంలో దేశంలో ముస్లిం లీగ్ పార్టీలు పరోక్షంగా(గాంధీ కుటుంబం) ఎన్నో ఘోరాలు చేశాయి. అవి ఎంతగా ప్రభావం చూపాయి అంటే.. వాటి ఫలితాలు నేటికి ప్రజలు అనుభవిస్తున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చరిత్రలోకి వెళ్తే అన్ని రక్తపు మరకలు తప్ప మరేవి కనిపించవు..ఒక్క సారి చరిత్రలో కి వెళ్దాం పదండి…

అది 19వ శతాబ్దం ముగింపు దశకు చేరుకుంది. కొందరు తమకి స్వతంత్ర పోరాటంలో గుర్తింపు దక్కడం లేదని మతతత్వాన్ని అడ్డం పెట్టుకొని దేశంపై పట్టు సాధించేందుకు చేస్తున్న కుట్రలు. ఒక వైపు హిందువులందరు చరిత్ర చూడని విధంగా పోరాడుతుంటే, కొందరికి అది నచ్చలేదు కడుపు రగిలిపోతుంది ..నిజానికి హిందువులు గుర్తింపు కోరుకోవడం లేదు. వారు కోరుకుంది స్వాతంత్ర్యo మాత్రమే అది ఎవ్వరు సంపాదించిపెడతారు అని నమ్మకo ఉందొ వారి బాటలోనే నడుస్తున్నారు.

కొందరికి అహింస మార్గం నచ్చి వారి వైపు వెళ్తుంటే, కొందరికి హింస మార్గం నచ్చి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల వెంట చంద్ర శేఖర్ ఆజాద్ లాంటి వారి వెనకాల నడవ సాగారు. అందులో ముస్లింలు కూడా హిందువు నాయకుల వెంట నడుస్తునందుకు కొందరు ముస్లిం నాయకులకు ఈ విషయం నచ్చలేదు.
స్వతంత్ర సంగ్రామంలో అప్పటికే RSS సంస్థ నాయకులు స్వాతంత్రోద్యమ కారులకు ఆహారం,వసతులు, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయ సాగింది.

ఇందులో మొత్తం హిందువులు ఉన్నారు..Rss ముఖ్య ఉద్దేశం దేశ సేవ సంసృతి సంప్రదాయాలను కాపాడటం.కానీ ఇది హిందువుల కొరకు వారి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్న సంస్థగా ముస్లింలలో ప్రచారం చేయ సాగారు. కానీ అది హిందువుల సంస్థ కాదు. దేశ పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు అని చెప్పారు. వారి ప్రచారం విఫలం కావడంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు.ఇప్పుడు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు అది ముస్లిములను ఏకం చేసి భారత దేశంలో ఆధిపత్యం చెలాయించాలి.దానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించారు. కేవలం ముస్లిం ల ప్రయోజనాల కోసం మతతత్వ సంఘాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు వ్యతిరేకిస్తారు.

అందుకని వారు ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ ని సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు. దీనిని ముస్లింలు చదువుకోవడానికి స్థాపించిన సంస్థగా ప్రచారం చేశారు చదువు వల్లనే స్వతంత్రం వస్తుందని ప్రచారం చేయసాగారు. ఈ సంస్థకు హిందువులు కూడా విరాళాలు ఇచ్చారు. కానీ దాని అంతరార్థం మతతత్వ వ్యాప్తి అని ఎవ్వరు ఉహించలేక పోయారు. చాలా మంది ముస్లిం యువకులను ఈ సంస్థలో చదువుల పేరుతో చేర్పించ సాగారు. ఒక వైపు హిందువులందరు స్వాతంత్రోద్యమం చేస్తుంటే, ఈ సంస్థ ముస్లిం యువకుల్ని పిల్లల్ని చదువు పేరుతో ఉద్యమానికి దూరం చేసింది..

మెల్లగా మతతత్వ భావనలను ముస్లిం ప్రజల్లో వ్యాప్తి చేయటం జరిగింది ఇదే సంస్థ 1926 డిసెంబరు30న అఖిల భారత ముస్లిం లీగ్ గా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో M. A జిన్నా ఇంగ్లండ్ లో చదువు పూర్తి చేసుకొని భారత్ కు వచ్చాడు.అప్పట్లో ముస్లింలలో బాగా చదువుకున్నవాళ్ళలో జిన్నా ప్రముఖుడు.ఆగా ఖాన్ కన్ను జిన్నాపై పడింది.జిన్నా తమ పార్టీలో ఉంటే బావుంటుంది పైగా చదువుకున్నవారు అని భావించి జిన్నా ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ జిన్నా దానికి వ్యతిరేకంగా లౌకిక వాదిగా దాదాభాయ్ నౌరోజి అనుచరుడిగా జాతీయ కాంగ్రెస్ లో చేరాడు.

దీనితో ఆగా ఖాన్ ప్రయత్నం విఫలం అయ్యింది.కానీ తన ఆలోచనలను ప్రయత్నాలు మానుకోలేదు. ఆంగ్లేయులు భారత్ లో ఎన్నికలు నిర్వహిస్తాం ప్రజా ప్రతినిధుల కోసం అని ప్రకటించారు. దీన్ని సరైన అవకాశంగా భావించి ముస్లిం లీగ్ జాతీయ కాంగ్రెస్ ముందు కొన్ని విన్నపాలను ఉంచింది. అవన్నీ ముస్లింలకు అనుకూలంగా జాతీయతను దెబ్బతీసే విధంగా ఉండటం వల్ల అంగీకరించలేదు. అన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్న నాయకులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని ప్రకటించారు దీనితో చాలా ప్రాంతాల్లో హిందు నాయకులదే హవా ఉండటం చేత అది ముస్లిం లీగ్ పార్టీకి నచ్చలేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్న అగ్రనేతలకు హిందూ ముస్లిం అనే తేడా లేదు అందరూ ఒక్కటే అనే భావన ఉంది. జాతీయ కాంగ్రెస్ కు జిన్నా వ్యతిరేకంగా మారాడు.

కాంగ్రెస్ నుండి ముస్లిం లీగ్ పార్టీకి మారాడు అతనిలో కూడా మతతత్వ భావనలు ఏర్పడ్డాయి. దీనితో ఆగా ఖాన్ పార్టీ భాద్యతలు జిన్నాకి అప్పగించాడు.జిన్నా ముస్లింలను రెచ్చగొట్టే విదంగా సభలను ర్యాలీలు నిర్వహించాడు. ఈ చర్యలను కాంగ్రెస్ విమర్శించలేక పోయింది.పైగా ముస్లిం లీగ్ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికే అంటూ పేర్కొంది.
అప్పటికే M.N ముఖర్జీ, హెడ్గే గొల్వల్కర్ లు స్థాపించిన హిందూ మహాసభ,RSS వంటి సంస్థలు ఉన్నాయి. ఇవి జాతీయ కాంగ్రెస్ చర్యలను తప్పుబట్టారు.కానీ కాంగ్రెస్ వాటిని లెక్కచేయలేదు.
లాల్ చంద్ గారు ఈ చర్యలను రాజకీయాల్లో ఆత్మ త్యాగం అనే పుస్తకంలో కాంగ్రెస్ ను “హిందువులు తలకెత్తుకున్న దురదృష్టం”గా వర్ణించారు.
ఈ ముస్లిం నాయకులు చేస్తున్న అఘాయిత్యాలను కాంగ్రెస్ అదుపు చేయలేకపోయింది. జిన్నా మరొక్కమారు ముస్లింల తరుపున వారి డిమాండ్లను జాతీయ కాంగ్రెస్ ముందు ఉంచాడు.
ఇందులో ప్రధానంగా 4 అంశాల గురించి మాట్లాడదాం.
1) ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతల్ని స్వయం ప్రతిపత్తి ప్రాంతాలుగా గుర్తించాలి (దీన్ని పాకిస్థాన్ ఏర్పాటుగా చెప్పకుండా స్వయం ప్రతిపత్తి కేంద్రాలుగా చెప్పారు)
ఈ ప్రాంతాలు కాశ్మీర్, లాహోర్,కరాచీ పంజాబ్, సింధ్ ప్రావిన్స్, బెంగాల్ లు గా చెప్పారు.
2) ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు (అంటే ఈ నియోజక వర్గాల్లో కేవలం ముస్లిలు మాత్రమే ఓటును వినియోగించుకోవాలి వేరే మతాలకు ఓటు హక్కు లేదు.)
3. అధికారాల్లో వాటా ఇవ్వాలి.(దీన్నే ముస్లిం రిజర్వేషన్లు గా చెప్పవచ్చు)
4.ముస్లింలందరిని మైనారిటీలు గా గుర్తించి వారికి ప్రత్యేక ఆర్థిక సహాయం అంద చేయాలి.
5.ప్రత్యేక హక్కులు చట్టాలు ఆమోదించాలి.

ఇవన్నీ ఆమోదిస్తే అంగీకరిస్తే హిందువులకు ద్రోహం చేయబడుతుంది అని కాంగ్రెస్ కు తెలుసు. కానీ వీటన్నిటిని కాంగ్రెస్ ఆమోదించింది.ఈ చర్యను హిందూవులకు వెన్నుపోటుగా మరియు పాకిస్తాన్ ఏర్పాటుకు మద్దతు గా చెప్పవచ్చు. ఒక విదంగా హిందువుల ప్రయోజనాలను ఊచకోత కోశారనే చెప్పాలి.
దీనికి వ్యతిరేకంగా మదన్ మోహన్ మాలవ్యా, లాలా లజ్ పతి రాయ్, RSS అధినేత M. S గోల్వాల్కర్ గళం విప్పారు. కానీ వారి వాదనను వినే పరిస్థితుల్లో హిందువులు లేరు. కారణం గాంధీ మరియు కాంగ్రెస్ వారు ఏది చేసినా మంచి చేస్తారు అనే నమ్మకం.గోల్వాల్కర్ హిందూ లని హెచ్చరించారు. ఇది హిందూ సమాజాన్ని బానిసగా చూడాలని చేస్తున్న కుట్రగా!
ముస్లిం లీగ్ డిమాండ్లు అంగీకరించడం వలన మతతత్వ సంస్థలకు రాజకీయ బలం చేకూరింది..
మతతత్వ విధానానికి కాంగ్రెస్ అవలంబించిన పద్ధతులు.,
1) వీరికి సామాజిక రాజకీయ ప్రత్యేక హక్కుల్ని కల్పించటం. దీని వలన ముస్లిం లు ఒక్కటే అనే భావన చేరువై మేము భారతీయులం అనే భావనకు దూరమయ్యారు.
2)మతతత్వ వాదులకు అధికారుల అభిమానం,ప్రోత్సాహం లభించడం వల్ల వీరు చేస్తున్న అకృత్యాలకు అడ్డు లేకుండా పోయింది.
3)మతతత్వ పత్రికల పట్ల,వ్యక్తుల పట్ల ,సంస్థల పట్ల,ఆందోళనల పట్ల ఎనలేని సహనం చూపించడమైనది.
4)ముస్లిం లీగ్ మతతత్వ సంస్థలకు రాజకీయ బలం చేకూరడం వల్ల వీరికి ప్రజలపై పట్టు సాధించింది.
5)వీరికి ప్రత్యేక నియోజక వర్గాల కేటాయింపు వలన వాటిని మతతత్వ శక్తుల అభివృద్ధి కేంద్రంగా వాడుకున్నారు.

వీటికి వ్యతిరేకంగా హిందువులకు బాల గంగాధర్ తిలక్ ,లాల్ లజపత్ రాయ్ పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ,సామూహిక గంగా స్నానాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్ని చెడగొట్టడానికి ముస్లిం లీగ్ ముస్లిం కుట్ర దారుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొన వలసిందిగా పిలుపు నిచ్చారు. దీని వలన ఇది హిందువుల కార్యక్రమం కాకుండా లౌకిక వాద చర్యగా సెక్యూలర్స్ గా ప్రచారం చేయ సాగింది. దీనితో కొంత నిరాశ చెందిన కానీ ఇంతలో గాంధీ దీనిని ప్రజల ఏకం కోసమే చేశారు అని ప్రకటించడం వలన, హిందూ ప్రజల సంఘటితంకు దూరం చేసింది.అంటే పరోక్షంగా హిందువులను పక్క దారి పట్టించడమే.ఒక వైపు గాంధీ, కాంగ్రెస్ లు ముస్లిం లీగ్ లకు మద్దతు చేస్తూనే మరో వైపు హిందు సంఘాలను వ్యతిరేకిస్తూ అణగదొక్కారు.

ప్రథమ ఎన్నికల సమయం వచ్చింది. ముస్లింలకు కేటాయించిన నియోజక వర్గాల్లో కేవలం ముస్లింలు మాత్రమే ఓటువేసే అధికారం ఉండటం వలన, వారు బహిరంగంగానే అల్లాహ్ పేరు ఖురాన్ పేరు చెబుతూ ఓట్లు అడగ సాగారు.మొదటి ఎన్నికల్లో 100 నియోజక వర్గాల్లో ముస్లిం లీగ్ పార్టీ గెలిచింది. దీని వలన జిన్నా తన ప్రత్యేక వాదాన్ని ముస్లిం రాజ్యానికి తెర తీశాడు. ఇది వారి రాక్షస చర్యకు నిదర్శనం.

అప్పటి వరకు జాతీయ కాంగ్రెస్ కు వారి లక్ష్యం అర్థం కాలేదు. అయిన పరిస్థితులు చేయిదాటిపోయాయి. స్వతంత్రం సిద్దించే సమయంలో ఇలాంటి చర్యలు ప్రజలు గుర్తిస్తే కాంగ్రెస్ మీద గాంధీ మీద ఉన్న నమ్మకం పోతుందని వారి తప్పులను కప్పి పుచుకునేందుకు లక్నోలో మతతత్వ సంస్థలతో ముస్లిం లీగ్ పార్టీతో ఒక రహస్య సమావేశం నిర్వహించారు వారు..ఇందులో గాంధీ కూడ ఉన్నారు.వారి డిమాండ్లు అన్ని రకాలుగా కాంగ్రెస్ మరియు గాంధీ ఒప్పుకున్నారు.

ఇన్ని డిమాండ్లు ఒప్పుకున్న కానీ జిన్నాకి ఒక భయం మనసులో అలాగే ఉంది అది ఏమిటంటే పాకిస్తాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న హిందువులు, అన్ని ప్రాంతాల్లో మెజారిటీగా ఉన్నారు.దీనివల్ల మనం పాకిస్థాన్ ఏర్పాటు చేస్తే ఎన్నికల్లో హిందువులు మనల్ని ఒడిస్తారు.ఒకవేళ హిందువుల ఓట్లు రద్దు చేసిన, ముస్లింలు భారీ నష్టాన్ని చూస్తారు. దీన్ని నివారించాలి అంటే కొన్ని కోట్ల మంది హిందువులను పాకిస్థాన్ ఏర్పాటు చేయబోయే ప్రాంతం నుండి తరిమేయాలి. అలా చేసిన ముస్లిం ప్రజలందరినీ హిందువులు చంపేస్తారు లేదా ఇంకేదైన నష్టాన్ని చవిచూస్తారు. జిన్నా దీనికి ఒక ఉపాయం ఆలోచించాడు. పాకిస్థాన్ ఏర్పాటు చేసే వారం ముందు రోజుల నుండి ముస్లిం సభలను నిర్వహించాలి.ఇలా చేయడం వలన ఆ ప్రాంతం లో ఉన్న హిందువులు భయపడతారు అని భావించాడు. ఒక వేళ ఇది కూడా విఫలం అయితే, హిందువు దేవాలయాల్ని ఇళ్లను దుకాణాలను తగలబెడితే వాళ్ళే ప్రాణ భయంతో పారి పోతారు అని భావించాడు.

బ్రిటిష్ వారు దేశ సరిహద్దుల్ని నిర్ణయించి, భారత్ పాకిస్థాన్ మ్యాప్ లను ఇండియా కు పంపారు. దేశ విభజన చట్టం పై నెహ్రు జాతీయ కాంగ్రెస్ తరపున సంతకం పెట్టాడు.కానీ పాకిస్తాన్ లో ఉన్న హిందువుల భద్రత గురించి మరిచిపోయారు. వారి హక్కుల గురించి కానీ వారి భవిష్యత్తు గురించి కాని ఎటువంటి చర్యలు తీసుకోలేరు. దీనిపై హిందుత్వ నాయకులు Rss నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు . జిన్నా మతతత్వ శక్తులకు పిలుపునిచ్చాడు ఇది పాకిస్తాన్ ముస్లింల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దేశంగా పేర్కొన్నాడు. వారికి హిందువులను పంపివేయటానికి ఆలోచన లేదు. హిందువులు గాంధీ- కాంగ్రెస్ మాటలు విన్నందుకు వారి ప్రాణాలు గాల్లో కలవబోతున్నాయ్.

ఆగస్టు14న పాకిస్తాన్ స్వాతంత్ర్యo ప్రకటించగానే కేవలం పాకిస్థాన్ లో ముస్లింలు ఉండాలని, హిందువులపై ఊచకోత కు దాడికి దిగారు. ఆ సంఘటనలో ముస్లింలు రాక్షసులకన్నా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. హిందువుల ఇళ్లలో చొరబడి స్త్రీలను మాన భంగం చేయసాగారు. గర్భిణీల కడుపుల్ని కోసి మంటల్లో వేయసాగారు. బాలింతల స్థనాల్ని కోయసాగారు. హిందువుల ఇళ్లను దుకాణాలను ఆస్తులను అగ్నికి ఆహుతి చేయసాగారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా తలలు నరికి ఆ మంటల్లో నరరూప రాక్షసుల్లాగా కాలుస్తున్నారు.ఈ సంఘటనలు రాక్షసత్వానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి.కొన్ని లక్షల మంది హిందువులు వందల కిలోమీటర్లు తరిమివేయ బడ్డారు. ఒక్క లాహోర్ రైల్వే స్టేషన్లో నేల కనిపించకుండా శవాలు పడిఉన్నాయి.

(ఇది చూసిన ఆంగ్లేయులు భయపడ్డారు. ఎందుకంటే ఈ ధైర్యం మన పాలనలో కనుక ఉంటే వీరికి మనం ఎప్పుడో చనిపోయావాళ్ళం అని ..ఈ సంఘటనలను ఆంగ్లేయులు ది ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ అనే బుక్ లో రాయబడింది ఇది లండన్ లో ఉంది.)

హిందువుల తలలు నరికి లాహోర్ నుండి ఢిల్లీ వచ్చే రైల్లో ఈ శవాలను నింపి నెహ్రూకు స్వాతంత్ర్య దినోత్సవ బహుమతి అని రాయబడింది. కొన్ని లక్షల మంది హిందువులు ప్రాణాలు చేత బట్టుకొని ఢిల్లీ చేరుకున్నారు.
తెల్లవారితే స్వతంత్రం. అందరూ సంబరాల్లో ఉన్నరే తప్ప, ఈ శరణార్ధుల గురించి ఆలోచించే వారు లేరు. చాలా మంది మసీదుల్లో గుడులల్లో ప్రభుత్వ భవనాల్లో తల దాచుకున్నారు. కానీ అధికారులు శరణార్ధులను ఖాళీ చేయించారు. వారికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక, ఢిల్లీ అంత వారి బాధని ప్రతిధ్వనిస్తుంది. కాంగ్రెస్ కానీ గాంధీ,నెహ్రూలు కానీ వారిని పట్టించు కోలేరు. అర్ధ రాత్రి జోరు వాన కురుస్తుంది. చాలా మంది చిన్న పిల్లలు ఆకలి తో అలమటిస్తున్నారు. సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

సరిగ్గా ఆ సమయంలో Rss నాయకులు అక్కడి పరిస్థితులను పరిశీలించి, వారికి ఆహారం తాగునీటి చర్యలను ఆ అర్ధ రాత్రి ఏర్పాటు చేసింది. చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి. కొన్ని మందులను కూడా సమకూర్చింది. కొన్ని బృందాలు అక్కడ సేవ చేస్తున్నాయి . ఆ బృందాలలో నాథురాం గాడ్సే కూడా ఉన్నారు.చాలా మంది పిల్లలు ఆకలికి తట్టుకోలేక మృతి చెందారు. వారి రోధనలతో ఢిల్లీ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరి మొఖంలో కన్నీళ్లు విచార సంఘటనలు ఉన్నాయి.

నాథురాం గాడ్సే పాకిస్థాన్ లో జరిగిన హింస గురించి అక్కడ ఉన్న శరణార్ధుల ను అడిగి తెలుసు కున్నాడు. వారు పడ్డ బాధలు వింటున్నాడు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి గుండె బరువెక్కడం మొదలైంది.కానీ వారు గాంధీ నెహ్రూలు సరైన సమయంలో స్పందించి ఉంటే మాకు ఈ భాద ఉండేది కాదు అని విలపించ సాగారు. గాడ్సేకి అప్పుడు అర్థం అయింది కాంగ్రెస్- గాంధీలు ఇంత నీచనికి దిగజారారని. తెల్లవారింది. ఢిల్లీ వీధులు శవాల కుప్పల్ని తలపిస్తున్నాయి. చాలా మంది నిద్రలోనే చనిపోయారు. అన్ని పత్రికల్లో స్వాతంత్య్రం,గాంధీ నెహ్రూలు గురించి తప్ప ఈ మరణ కాండ గురించి ఎక్కడ కూడా లేదు. ఈ మరణ కాండ గురించి పాత్రికేయులకు తెలుసు. కానీ గాంధీ – నెహ్రూలకు వ్యతిరేకంగా రాసే దమ్ము ఏ పత్రికకు లేదు.

ఇదంతా చూసిన గాడ్సే ఇంత జరుగుతున్నా గాంధీ నెహ్రూలకు చీమ కుట్టిన విధంగా కూడా లేదని, సమాజం కూడా గాంధీ నెహ్రూలను సమర్థించడం అతన్ని విస్మయానికి గురిచేసింది. గాంధీ నెహ్రూలు ఎవ్వరి మాట వినరు. దీన్ని ఆపాలంటే గాంధీ చావు ఒక్కటే మార్గం అని అతనికి తోచింది. తను చేసే పని తన పాత్రికేయ వృత్తికి తను పనిచేస్తున్న RSS సంస్థకు చెడ్డ పేరు తెస్తుందని, అలా చెడ్డపేరు రావటం తనకు ఇష్టం లేదు కాబట్టి తను చేసే పాత్రికేయ వృత్తికి రాజీనామా చేశారు, అలాగే RSS కార్యకలాపాల నుండి తప్పుకున్నారు.

పాకిస్థాన్ కి ఇవ్వాల్సిన 55 కోట్ల రూపాయల్ని ఇవ్వాలని గాంధీ కాంగ్రెస్ అధిష్టానం ని కోరింది.దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు అని, ఎందుకంటే కుట్ర పూరితంగా
patel-nehru పాకిస్థాన్ కాశ్మీర్ ని ఆక్రమించింది. ఆ డబ్బులు మనం చెల్లిస్తే, అదే డబ్బుతో మనపై యుద్దానికి వస్తారని చెప్పారు. కానీ గాంధీ పటేల్ మాటల్ని పట్టించుకోకుండా, ఢిల్లీలో 1948 జనవరి13 న నిరాహార దీక్షకు దిగారు.అందులో ప్రధానమైన డిమాండ్స్ 2…..
1. పాకిస్థాన్ కి మద్దతుగా వారి బాకీని 55 కోట్లు చెల్లించాలి.
2.పాకిస్థాన్ నుండి వచ్చిన శరణార్థులు, అనుమతి లేకుండా ప్రభుత్వ భవనాల్లో మసీదుల్లో ఉండకూడదు.
ఇది చాలా మందికి నచ్చలేదు.

గాంధీ పాక్ కు మద్దతు తెలుపడం. అన్యాయంగా శరణార్థులకు వ్యతిరేకం తెలపటం.గాంధీ డిమాండ్లకు కాంగ్రెస్ తలొగ్గక తప్పలేదు. చివరికి గాంధీ డిమాండ్లు నెరవేరాయి.చాలా మంది హిందువులు, గడ్డకట్టే చలిలో చెట్లకింద నివాసం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఇదంతా చూస్తూ కూడా కాంగ్రెస్ కానీ పాత్రికేయులు కానీ అధికారులు కానీ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.ఇది తప్పని ఏ పత్రికవారు కూడా ఖండించలేదు.

జనవరి 20న ఢిల్లీ లోని బిర్లాహౌస్లో గాంధీని హత్య చేయాలనుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం.. గాంధీ ప్రసంగిస్తున్న వేదిక వెనక వైపు ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ నుంచి కాల్పులు జరపాలనుకున్నాడు దిగంబర్ బడ్గే. కానీ, కుదరలేదు. అక్కడ ఉన్న కిటికీ నుంచి గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే బాంబు విసురుదామనుకున్నాడు. అయితే అనుకోని కారణాల వల్ల, ఆ కుట్ర విఫలం అవటమే కాదు కుట్ర దారులు దొరికి పోయారు కూడా.

జనవరి 30 1948 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా ఆయనకు నాధూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు. ఇప్పటికే ఆలస్యమైందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది గాంధీ అనుచరురాలు అభా ఛటోపాధ్యాయ. కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపాడు. గాంధీజీ మరణించాడు. నేను తుపాకీని పైకెత్తి గట్టిగాపట్టుకొని నిలుచుని ‘పోలీస్! పోలీస్! అని అరవటం మొదలు పెట్టాను. నాకు కావాల్సిందంతా… నేను ముందుగా వేసుకొన్న పథకం ప్రకారమే నేను గాంధీ హత్యకు పాల్పడ్డానని అందరూ అనుకోవాలి.

అంతేకాని, ఏదో క్షణికావేశంలో చేశానని అనుకోకూడదు. అక్కడ నుంచి తప్పించుకుని పారిపోవటానికి ప్రయత్నిస్తున్నా గానీ, తుపాకీ వదిలించుకోవాలని అనుకుంటున్నానని గాని ఎవరూ అనుకోకూడదు. తుపాకీతో సహా పట్టుబడటమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషం దాకా, ఎవరూ కదలలేదు” అని గాడ్సే వివరించాడు.గాడ్సే లో దేశభక్తి, త్యాగం, ప్రేమ నేర్పింది RSS భావజాలమే అయినప్పటికీ, తాను తీసుకున్న నిర్ణయానికి దానితో దూరంగా ఉండటమే మేలని RSS కు దూరం అయ్యాడు.

గాంధీజీ బతికి ఉంటే కాశ్మీర్ను పాకిస్తాన్ కు ధారాదత్తం చేసే యోచనలో మన ప్రధాని నెహ్రు మరియు పాకిస్తాన్ ప్రధాని జిన్నా కుట్ర పన్నుతున్నారని దీనికి గాంధీజీ మద్దతు దొరికితే యిచ్చే ఆలోచనలో
gandhi-jinnah-nehru ఉన్నారు.అఖండ భారతాన్ని చీల్చడం యిష్టం లేని గాడ్సే, దానిని ఎలాగైనా భగ్నం చేయాలని దీనికి గాంధీజీని హత్య చేయడమే ఉత్తమ నిర్ణయంగా భావించి ప్రణాళిక రూపొందించాడు.గాడ్సే కుటుంబానికి గాడ్సేనే ఆధారం. కాని ఆయనకు దేశ భవిష్యత్తు ముందు తన కుటుంబ సమస్య చిన్నగా కనిపించింది. దేశం కోసం మరో త్యాగానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్దం అయ్యాడు. మరి గాంధీజీ ని చంపిన తర్వాత పారిపోవాలని చూడలేదు. గాంధీ చనిపోగానే ఎక్కువగా రోదించింది. గాడ్సే నే…. గాడ్సే త్యాగం మరువరానిది. ఒక వీరుడిలా తన ప్రాణాల్ని భారత మాత కోసం బలియిచ్చిన త్యాగమూర్తి.

కోర్టులో జడ్జి ముందు తన వాదనను వినిపించాడు ఇలా “నేను కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకిని.దేశ విభజనకు గాంధీ కాంగ్రెస్ లే కారణం.దేశ విభజన ముందు పాకిస్థాన్ లో ఉన్న హిందువుల భవిష్యతును గాలికి వదిలేశారు. కొన్ని కోట్ల మంది హిందువులు ముస్లింల ప్రకోపానికి గురయ్యారు.లక్షలాది స్త్రీలు మానభంగం కావింపబడ్డారు. భారతదేశానికి తిరిగి వచ్చిన హిందువులపై కర్కశమైన మనస్సుతో వారికి ఆశ్రయం కూడా కల్పించలేకపోయారు. హిందువులపై వివక్ష చూపుతూ పాకిస్థాన్ కు మద్దతుగా నిరాహార దీక్ష చేయడం దేశానికి ద్రోహం చేస్తున్న విషయం గా నేను భావించాను. ఇలా హిందువులపై,దేశంపై వివక్ష చూపించడాన్ని ఎవ్వరు ఖండించలేదు. కారణం గాంధీని ఎదిరించే శక్తి దేశంలో లేదు. ఈ అఘాయిత్యాలను నేనే సహింపక భవిషత్యులో ఇటువంటివి జరగకూడదని గాంధీ హత్యకు పూనుకున్నాను. నన్ను ఎవ్వరు ప్రోత్సహించలేదు.

మీరు ఎటువంటి శిక్షలు విధించిన మేము అంగీకారాన్ని తెలుపుతున్నాం”అని చెప్పాడు.
దానితో నేరం ఒప్పుకునందుకు గాడ్సే మరియు అతనికి సహాయం చేసిన నారాయణ ఆప్టేలకు ఉరిశిక్ష విధించడం జరిగింది. 1949 నవంబర్15న హర్యానా లోని అంబాల జైలులో అమలు చేశారు.
నా ఆలోచన ప్రకారం గాంధీని చంపటంలో తప్పులేదు.మీరు అనవచ్చు గాంధీ చాలా గొప్పవాడు అని. కానీ నా దృష్టిలో మాత్రం పక్షపాతే…

గాంధీ వల్లనే స్వాతంత్య్రం వచ్చింది అంటే నేను ఒప్పుకోను. అదే సుభాష్ చంద్ర బోస్ హింస వాదాన్ని అందరూ కొనసాగిస్తే, కేవలం కొన్ని రోజుల వ్యవధిలో స్వాతంత్య్రం వచ్చేది. ఎందుకంటే ఈ కలియుగంలో శాంతితో సమస్యకు పరిష్కారం దొరకదు. దెబ్బకు దెబ్బె జవాబు మాటకి మాట తూటకీ తూటాలే
gandhi-jathipitha సమాధానం సరైనది అని నేనంటాను. ఇదే విషయం మొన్న కాశ్మీర్ సమస్యలో కఠిన నిర్ణయాలు ధోరణులు అవలంభించారు కాబట్టే, సమస్యకు పరిష్కారం లభించింది. గాంధీ ఒక్కడే స్వాతంత్య్రం లో పాల్గొనలేదు. కొన్ని కోట్ల మంది పాల్గొంటే స్వాతంత్య్రం లభించింది.

( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)

Leave a Reply