కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వరుస శుభవార్తలు చెబుతోంది. దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్పై భారీగా ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. దీపావళి రోజున పెట్రోల్పై రూ. 5, డీజిల్పై రూ. 10 తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తోడుగా పలు రాష్ట్రాలు కూడా తమవంతుగా ధరలను తగ్గించాయి దీంతో కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్పై ఏకంగా రూ. 12 తగ్గింది. ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం ప్రజలకు మరో శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా వంటనూనె ధరలను తగ్గిస్తున్నట్లు శుక్రవారం కేంద్రం వెల్లడించింది. లీటర్ వంట నూనెపై రూ. 7 నుంచి, రూ. 20 వరకు తగ్గించింది. ఇందులో భాగంగా పామాయిల్పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18, సోయాబీన్పై రూ. 10, సన్ఫ్లవర్ ఆయిల్పై రూ. 7 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొన్నిరోజులుగా ధరల పెరుగుదలతో సతమతమైన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది…