Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మూడు డెడ్ లైన్స్ పెట్టారు

-పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినప్పటికీ లెక్క చేయకుండా ఏజెన్సీని మార్చడం పెద్ద తప్పు
– నిధుల కొరత, ప్లానింగ్ లేకపోవడం, రివర్స్ డ్రామా,
-ఇంత జరుగుతున్నా సీఎం మీడియా ముందుకు రారా?
– వైసీపీసర్పంచ్ లే దర్నాలు చేసే పరిస్ధితి
– ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మూడు డెడ్ లైన్స్ పెట్టారు
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

పోలవరం నిర్మాణంలో నిధుల కొరత, ప్లానింగ్ లేకపోవడం, రివర్స్ డ్రామా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినప్పటికీ లేక్క చేయకుండా ఏజెన్సీని మార్చడం పెద్ద తప్పులని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

సోమవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు అథారిటి, నీతిఆయోగ్ కలిసి వివిధ విభాగాల ద్వారా సమాచారం సేకరించి కేంద్ర జల వనరుల శాఖకు నివేదిక సమర్పించారు. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులపై నీతి అయోగ్ సూచనల మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీవారికి నివేదిక అందింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) హైదరాబాద్ సీనియర్ ఇంజినీరింగ్ అధికారి ప్రొఫెసర్ కె.బి.వి.ఎన్. ఫణీంద్ర నాయకత్వంలో జల వనరులు, ఆర్థిక, పునరావాస నిపుణులు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లింగ సామాజిక నిపుణురాలు, ఆర్‌అండ్‌ఆర్ నిపుణులు, లిబరల్ ఆర్ట్స్ కలిసి 5మంది సభ్యుల నాయకత్వంలో 124 పేజీల నివేదికను తయారుచేశారు. 2020-21 సంవత్సరాల్లో ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో 53 రోజులు, పది సార్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు.

హెడ్ వర్క్స్, ప్రాజెక్ట్ లోని వివిధ ప్రాంతాలు సందర్శించారు. ల్యాండ్ ఎక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ భాదితులతో సమావేశాలు నిర్వహించారు. నివేదిక తయారుచేసి కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక అందించారు. థర్డ్ పార్టీ అవాల్యూషన్ ఆఫ్ పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ నవంబర్ 2020-21లో పోలవరం ప్రాజెక్ట్ నీతి అయోగ్ వివిధ విభాగాలు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జల వనరుల శాఖకు నివేదిక వెళ్లింది. ఆ నివేదికలో 2015 నుంచి 2019 వరకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, శరవేగంగా, సమర్థవంతంగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేశారు.

డయాఫ్రమ్ వాల్, స్పిల్ వే నిర్మాణంలో గత టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో చేయించిన పనులు అన్ని వేగవంతంగా, సమర్థవంతంగా, శరవేగంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జరిగాయి. 2014లో స్పిల్ వే ద్వారా నీటి పారుదల జరిగింది. చాలా స్పష్టంగా ఆ నిపుణుల కమిటీ నివేదికలో చెప్పడం జరిగింది.

నేడు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల, ముఖ్యమంత్రి అసమర్థత వల్ల పోలవరంలో విధ్వంసం జరిగింది. గుత్తే దారుల మార్పే పోలవరానికి శాపమని స్పష్టంగా నివేదికలో వచ్చింది. ఇది జాతీయ ప్రాజెక్ట్, 50లక్షల ఎకరాలకి నీళ్లు తీసుకెళ్లే ప్రాజెక్ట్, 50లక్షల క్యూసెక్ ల వరద నీటిని తట్టుకొనే విధంగా స్పిల్ వే నిర్మాణం చేయబడుంది. నేడు మీ ప్రణాళిక లోపం వల్ల, సమన్వయం లేక నిర్మాణ సంస్థని అర్థంతరంగా మార్చేయడం వల్ల సరిదిద్దుకోలేని తప్పు జరిగిందని నిపుణులు కమిటీ తేల్చి చెప్పింది.

నిధుల కొరత తీవ్ర జాప్యం జరగడం, దిగువ కాపర్ డ్యాం మీద అలసత్వం, 30.5 మీటర్లు దిగువ కాపర్ డ్యాం చేయాల్సిన నిర్మాణం చేయకపోవడం వల్ల ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం మధ్యలో నీరు నిలబడి నేడు పని చేయాల్సిన ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగిపోయింది. ఇది చారిత్రాత్మక వైఫల్యం. ఎగువ కాఫర్ డ్యాం లోని ఖాళీలని పూర్తి చేయలేక పోయారు.

2019లో వచ్చిన 15లక్షల వరద నీరు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేయబడ్డ స్పిల్ వే ద్వారా స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్ లో పడి ధవళేశ్వరం బ్యారెజ్ ద్వారా సముద్రంలోకి చేరాయి. 2022 లో వచ్చిన 22లక్షల క్యూసెక్ ల వరద నీటి ప్రభావం డయాఫ్రమ్ వాల్ మీద పడింది.

ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం జరుగుతన్నప్పుడు మే 19 నాటికి అధికారంలోకి వైసీపీ వచ్చింది. జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పర్యటనలో అధికార యంత్రాంగం చాలా స్పష్టంగా డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం చేయబడుంది, 14 నెలలో గోదావరి వరదలు వచ్చే సమయంలో వరద తాకిడిని కూడ తట్టుకొని జర్మనీ బావరీ సంస్థ, ఎల్ అండ్ టీ జాయింట్ వెంచర్ లో నిర్మాణం జరిగింది, దాని మీద అప్పర్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణ పనులు మొదలు పెట్టాలి, ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్స్ ఫిలప్ చేయాలి. 17వేల 5వందల మంది నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి అని స్పష్టంగా నివేదికలో చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అధారటీ అత్యవసర సమావేశాలలో కూడ చెప్పారు. ఏజెన్సీలు మార్చోద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని పోలవరం ప్రాజెక్ట్ సిఇవో స్పష్టంగా వ్యక్తపరిచారు. ఈ వైఫల్యం గురించి ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలి.

గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులను ముందకు తీసుకెళ్లి పక్కా ప్రణాళికతో, నిదులను కేటాయించి, రీయింబర్స్ లో కేంద్రం ప్రభుత్వం నుంచి 6వేల 5వందల కోట్లు నిధులను తెసికోస్తే, మీరు చంద్రబాబు నాయుడు ఖర్చుపెట్టిన 4వేల కోట్లు నిదులు వస్తే వాటిని కూడ ప్రాజెక్ట్ కోసం, నిర్వాసితుల ఖర్చు చేయలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాలలో 10వేల 5వందల 84కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. నేడు 37 నెలలో 2వేల 7వందల 42కోట్లు ప్రణాళిక, అవగాహన లేకుండా మీ ఇష్టానుసారం ఖర్చు చేశారు.

బడ్జెట్ లో 11వేల 460కోట్లు పెట్టాం అని చెప్పారు. కాని ఖర్చు పెట్టింది 2వేల 742కోట్లు మాత్రమే. కనీసం 25శాతం కూడ లేదు. ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ అన్ని కూడ నిర్లక్ష్యం చేశారు.
పోలవరం నిర్వాసిత ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఏడు ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్ భూ భాగంలో కలిపితే పోలవరం కల సాకారం అవుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చేర్చారు.

వైసీపీలో నుండి గెలిచిన సర్పంచ్ లే దర్నాలు చేసే పరిస్ధితి వరద ముంపు ప్రాంతాలలో కనపడుతుంది. మంచినీరు అందలేదని, రెండు వారాలుగా కరెంటు లేదని, నివాసిత ప్రాంతాలలో పాములు, తేళ్లు వస్తున్నాయని, కనీసం భోజన వసతి సదుపాయం లేదని పక్కా రాష్ట్రం ముంపు భాదితులకి 10వేల రూపాయలు అందజేస్తే మాకు కనీసం 2వేల రూపాయలు కూడ ఇవ్వడం లేదని, 5కిలోల బియ్యం కూడ ఇవ్వలేదు, కూరగాయలు ఇవ్వలేదని రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రికి సిగ్గుగా లేదా. దీనికి ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు భాద్యత తీసుకుంటారు. వేలాది మంది నిర్వాసితులు రోడ్డెక్కుతుంటే మీరు బాధ్యత లేకుండా గాల్లో తిరుగుతూ గాలి కబుర్లు చెప్తారా. చంద్రబాబు నాయుడు రెండు ముంపు ప్రాంతాలలో పర్యటించి వారు పడుతున్న బాధలు చూశారు. వాళ్లు తాగే నీరు కూడ అందరికి చూపించారు. ప్రజలు ఇంత కష్టాలు పడుతుంటే మీకు చీమ కుట్టినట్టైన లేదా.

నవంబర్ 21న నివేదిక వస్తే ముఖ్యమంత్రి ఏ విధంగా మూడు సార్లు జూన్ 2021, 2022, 2023కి పూర్తి చేస్తానని సంవత్సరాలు మార్చుకుంటూ ప్రాజెక్ట్ కి డెడ్ లైన్స్ పెడతారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధుల కొరత, ప్లానింగ్ లేకపోవడం, రివర్స్ డ్రామా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినప్పటికీ లేక్క చేయకుండా ఏజెన్సీని మార్చారు. ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేదు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో వారు ఇచ్చిన నిర్మాణ సంస్థలు పాటించలేదు. ఇవన్నీ ఘోరమైన చారిత్రాత్మక తప్పిదాలు. వీటన్నింటికి వైసీపీ ప్రభుత్వం అసమర్థత,చేతకానితనం, వైఫల్యం అని స్పష్టంగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి మూడు సార్లు డెడ్ లైన్ లు మార్చారు. అనుభవంతోచెబుతున్నాను ఆడుకోవద్దు, రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, రైతాంగ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని నాశనం చేయొద్దు, ముంచొద్దు, అన్యాయం చేయొద్దని 47 యేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు చేతులెత్తి అసెంబ్లీలో చెప్పినా వినలేదు. జగన్ మూర్ఖత్వం, తెలివితక్కువ, చేతకానితనంవల్ల, అసూయ, ధ్వేషం వల్ల 72 శాతానికి వెళ్లిన పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. 53 రోజులు 10 సార్లు డ్యామ్ సైట్ కు వెళ్లారు. నిర్వాసితులకు వద్దకు వెళ్లి వారి బాధలు తెలుసుకున్నారు. వీటిపైన జగన్ మాట్లాడాలి.

ప్రజలకు జీవనాడి, ప్రాణనాడి అయిన పోలవరం గురించిన విషయాన్ని రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు సత్యాలను గ్రహించాలి. దీనిపై కేంద్రం స్పందించాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటి కూడా స్పందించాలి. జలవనరుల శాఖ మంత్రి కూడా స్పందించాలి. ఈ విధ్వంసాన్ని ఆపాలి. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి. పోలవరం ప్రాజెక్టు గురించి స్పష్టంగా, వైసీపీ ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ డ్రామాల గురించి, రీ టెండరింగ్ గురించి వివరించారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మూడు డెడ్ లైన్స్ పెట్టారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారనడానికి రిపోర్టులే సాక్ష్యం. అడ్డగోలుగా, బాధ్యతారాహిత్యంగా, చేతకానితనంగా, ముఖ్యమంత్రికి పరిపాలనా అర్హత లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE