-రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత
అవినీతి, అజ్ఞానం, అహంకారం కలిస్తే జగన్మోహన్రెడ్డి అన్న విషయం మరోసారి నిరూపితమైంది. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో మద్యం విక్రయాల సమయాన్ని పొడిగించి కరోనా వ్యాప్తికి రహదారులు వేశారు.మొన్న ఉపాధ్యాయులతో మద్యం అమ్మించారు, నిన్న తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు… నేడు కోవిడ్ సమయంలో విక్రయాల సమయం పెంచి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం దుర్మార్గం. కోవిడ్ సమయంలో రాత్రింబవళ్లు మద్యాన్ని విక్రయించడమే మద్యపాన నిషేదమా? కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం విక్రయాలపై నియంత్రణ విధిస్తుంటే రాష్ట్రంలో మాత్రం యధేచ్చగా మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్రంలో మహిళలపై గృహహింస, హత్యలు, అత్యాచారాలు పెద్ద ఎత్తున చోటుచేసుకుంటున్నాయి. మద్యం రేట్లు పెంచితే మద్యానికి అలవాటు పడినవారు మద్యం సేవించడం మానేస్తారని చెప్పిన ప్రభుత్వం ఎందుకు ధరలు తగ్గించింది? ఇప్పుడు విక్రయాల సమయం ఎందుకు పెంచింది? టార్గెట్లు పెట్టి మద్యం ఆదాయం పెంచుకోవడమే దశలవారీ మద్యపాన నిషేధమా? ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మద్యం విక్రయాల సమయం పొడిగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మహిళలకు ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.