ఏపీ ప్రభుత్వం తీరుపై ఉద్యోగుల సంఘం ఆగ్రహం

– ప్రభుత్వానికి అనుబంధ సంస్థ గా మేము కొనసాగము
– కోరి జగన్ ను సిఎం గా గెలిపిస్తే.. మా బాధలను అసలు పట్టించుకోవడం లేదు
– బెయిలుపై తిరిగే వ్యక్తికి సలహాదారు పదవెలా ఇస్తారు?
– ఉద్యోగుల సొమ్మును స్వాహా చేసిన చంద్రశేఖర్ రెడ్డి కి ఉద్యోగుల సలహా దారునిగా నియమించడాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ..
విజయవాడ : ఉద్యోగుల సమస్యలు పై ప్రభుత్వం స్పందన సరిగా లేదు. రెండు రోజుల పాటు మా సర్వసభ్య సమావేశం లో ప్రభుత్వం తీరు పై చర్చించాం.ఉద్యోగుల పట్ల ప్రభుత్వం గౌరవంతో వ్యవహరించడం లేదు.సిఎం ఇటీవల కలిసి సమస్యలు పై స్పందించాలని కోరాం.వంద అంశాలను వివరించగా యనభై అంశాలలో అందరూ ఏకాభిప్రాయం తో ఉన్నారు.
ఆర్ధిక పరమైన అంశాలతో సంబంధం లేకపోయినా వాటిని పరిష్కరించడం లేదు.ప్రభుత్వం ఆలోచనలకు తగ్గట్లుగానే ప్రభుత్వ ఉద్యోగుల లు పని చేస్తారు.సిపియస్ రద్దు, డి.ఎ ల చెల్లింపు, పి.ఆర్సీ అమలు, సాయంత్రం ఐదు తర్వాత పని‌ చేయన్నక్కర్లేదని జగన్ హామీ ఇచ్చారు.రెండున్నరేళ్ల పరిపాలన పరిశీలిస్తే… ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
కోరి…మేమంతా జగన్ ను సిఎంగా గెలిపిస్తే.. మా బాధలను అసలు పట్టించుకోవడం లేదు.పిఆర్సీ విషయంలొ కొన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల ను మభ్య పెడుతున్నాయి వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదికను మాకు ఇవ్వాలని కోరాం. నేటి వరకూ సమావేశం మినిట్స్ కూడా ఇవ్వలేదు.
జి.పి.ఎఫ్., పదవీ విరమణ బెన్ ఫిట్స్ పెండింగ్‌లో పెడుతున్నారు. వారం రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేస్తామని చెప్పి… మరచిపోయారు. ఆర్ధిక శాఖ అధికారులు మాటలు చెప్పడం తప్ప… డబ్బు మాత్రం ఇవ్వడం లేదు. ఉద్యోగుల సమస్యలు పై ఈ ప్రభుత్వానికి సీరియస్ నెస్ లేదు.
ప్రభుత్వానికి అనుబంధ సంస్థ గా మేము కొనసాగము. ఉద్యోగులకు ఒకటో తేదీన ఇవ్వలేక పోయినా .. ఎప్పుడో ఒకప్పుడు ఇసదతున్నాం కదా అని బుగ్గన చేసిన వ్యాఖ్యలు ను ఖండిస్తున్నాం. ఉద్యోగుల ను కించ పరిచేలా బుగ్గన మాట్లాడం మానుకోవాలి. ఉద్యోగ సంఘాలను బలహీనం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.
ఏపీ యన్జీఒ తాజా మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ని నియమించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది. ఈ కడప రెడ్డి గారు… ఉద్యోగుల సంక్షేమం కోసం ఏ సలహాలు ఇస్తారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఉమ్మడి ఎపి లో హైదరాబాద్ లో 182ఎకరాలలో ఉద్యోగుల భూములను అమ్ముకున్నారు. విజిలెన్స్ విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఏపీ ప్రభుత్వం అధికారికంగా చంద్రశేఖర్ రెడ్డి ఫై క్రిమినల్ కేసు బుక్ చేసింది. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే బయట తిరుగుతున్నారు. కేసు పెట్టిన ప్రభుత్వమే .. ఉద్యోగుల సలహాదారునిగా ఎలా ఇస్తారు. సిఎం జగన్మోహన్ రెడ్డి కి ఈ అంశాలు చెప్పకుండా, పదవి ఇచ్చారనే అనుమానం కలుగుతుంది. APGL సంస్థ ఇన్సూరెన్స్ లు కట్టించుకుని డబ్బు చెల్లించడం లేదు.
దీని పై త్వరలో ఢిల్లీ వెళ్లి సంస్థ పై ఫిర్యాదు చేస్తాం. జి.పి.యఫ్ అనేది మా జీతంలో నుండి దాచుకున్న సొమ్ము. బ్రిటిష్ కాలం‌ నాటి నుండి ఇది ఆప్షనల్ గా అమలవుతుంది. సొమ్మును కూడా ఎక్కడైనా మదుపు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము సాలీనా ఎనిమిది నుండి పది కోట్ల రూపాయలు ఉంటుంది.
ప్రభుత్వం ఇది తమ ఆదాయంగా మార్చుకుని ఇతర అవసరాలకు వాడేస్తుంది. అయితే అవసరానికి విత్ డ్రా చేసుకునే అవకాశం మాకు ఉంటుంది. కానీ ఇప్పుడు గత యేడాదిన్నరగా మా జిపి.ఎఫ్ డబ్బులు చెల్లించడం లేదు. మాకు ప్రత్యేక ఎకౌంటు పెట్టి మా జి.పి.ఎఫ్ డబ్బు మాకు ఇవ్వాలి.
అకౌంటెంట్ జనరల్ నుండి అక్టోబర్ 28న ఒక మెసేజ్ వచ్చింది.ఉద్యోగుల ఖాతాల్లో నుండి డబ్బు విత్ డ్రా చేసినట్లు మెసెజ్ పెట్టారు. ఈ వ్యవహారం పై సిఎం విచారణ చేయించాలి.
సి.ఎం.యస్.ఎఫ్, ఆర్ధిక శాఖ అధికారులు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.మా డబ్బుకు అసలు భద్రత ఉందా అనే అనుమానాలు కలుగుతుంది. పోస్ట్ డేటెడ్ చెక్కు ఇచ్చి డి‌ఎ డబ్బులు మా అకౌంట్ లో వేశారు.మాకు తెలియకుండా మళ్లీ ఆడబ్బును విత్ డ్రా చేశారు.
మాఖాతాల్లో సొమ్ము మా ప్రమేయం లేకుండా వెనక్కి ఎలా తీసుకుంటారు. ఆర్ధిక మంత్రి బుగ్గన ఇచ్చే ప్రకటనలు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని నమ్ముతున్నాం. హైకోర్టులో కూడా ఇదేవిధంగా ప్రభుత్వం కౌంటర్ వేసింది. ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన చెల్లించాలని ఒక చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రాబోయే రోజుల్లో ఉద్యోగులు కూడా ఆలోచన చేసి.. క్రియాశీల కార్యచరణ కు సిద్దం కావాలి. ఉద్యోగులంతా కలిసి ఈ దురాగతాలను ఎదుర్కోవాలి. 17వ తేదీన అసెంబ్లీలో తొలి బిల్లుగా ప్రతిపాదించి ఆమోదం తెలపాలి.

Leave a Reply