Suryaa.co.in

Features

అదానీ-అంబానీలపై పోరాటం సరే.. మన నలుపు సంగతేమిటి క్రామ్రేడ్స్?

– సెబీ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు
– షెల్ కంపెనీలతో షేర్ల బదిలీలు
– అభ్యుదయం ఎంత పనిచేసింది?
– క్రామ్రేడ్స్… ఇదేం నైతికత ?
– ఎర్ర జెండా పేరుతో అమాయక ప్రజలను ఆర్థికంగా మోసం చేసిన విప్లవ పార్టీలు, వారి నాయకులు

అభ్యుదయ సమాజం సమీప భవిష్యత్తులో సహకారం అవుతుందో లేదో తెలియదు కానీ, కనీసం కనిపించని భూతల స్వర్గాన్ని, మాటల్లో చూపించే నాయకులు ఒకనాడు ఉండేవారు. మంచి చెప్పిన చెడు చెప్పిన వాళ్ళ మాటలకు, ఒక క్రెడిబిలిటీ ఉండేది. కాలం మారింది. కార్యకర్తల లక్ష్యంలో కాసింత నిర్వేదం ఉన్నప్పటికీ, ఆ నాయకుల వ్యాపారాత్మక ఆలోచనలు రోజురోజుకీ మరింత దిగజారుతున్నాయి.

10tv-teluguఈ నాయకుల ఆలోచన నుంచి టెన్ టీవీ పుట్టింది. అభ్యుదయం మాటున మరో లోకం సహకారం కోసం, అభ్యుదయ బ్రాండ్ కాస్టింగ్ పేరుతో, మరో లోకం నిర్మిద్దాం అని.. కూలీనాలీ కార్మిక కర్షక బడుగు జీవుల దగ్గర, కోట్లాది రూపాయలు వసూలు చేసింది సిపిఎం పార్టీ. అభ్యుదయం నో. ప్రగతి నిరోధక పనులు ఉన్నాయని, ప్రగతి బ్రాండ్ కాస్టింగ్ లిమిటెడ్ ఇంకో పిల్లా ముఠా… ఇది మాత్రమే చాలదు అని, స్ఫూర్తి బ్రాండ్ కాస్టింగ్ లిమిటెడ్ పేరుతో మరో పిల్ల కంపెనీ.

వర్తమాన పరిభాషలో అది షేల్ కంపెనీ. వసూళ్లకు తెగబడ్డారు. మొత్తానికి వాళ్లకు సరిపోయినదాని కన్నా ఎక్కువ డబ్బులు వచ్చాయి (100 కోట్లు) అదనపు విలువను రెట్టింపు విలువలు చేద్దామని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు. అటు అభ్యుదయానికి – ఇటు ప్రగతికి తెలియకుండా పెట్టుబడులు పెట్టారు. దానికి లాండ్ ఫర్ పర్చేసింగ్ కమిటీ అనే ముద్దు పేరు. కొంత సొమ్ముతో టీవీ పెట్టారు. పదిమంది కలిసి పెట్టారు కాబట్టి , దానికి టెన్ టీవీ అని పేరు పెట్టుకున్నారు. అది గిట్టుబాటు కావడం లేదు అని, ఇంకో బడా పెట్టుబడుదారికి, టెన్ టీవీ అడ్డికి పావు షేరు లెక్క అమ్ముకున్నారు.

అప్పటి వరకు కథ బాగానే ఉంది. అది పబ్లిక్ గా షేర్ రూపంలో వసూలు చేసిన సొమ్ము. ఒక పది లక్షల చిట్ ఫండ్ నడపడానికి సవాలక్ష అనుమతులు తీసుకోవాలి. ఇక్కడ సొమ్ము కోట్ల రూపాయలలో వసూలు చేయడం, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్పోజి ఓల్డ్ ఆఫ్ ఇండియా (సేబి) నిబంధనలకు విరుద్ధం. ఆ విరుద్ధమైనimage పని అయినా, తెలివిగా వ్యాపార లావాదేవీలు నడిపించి, వాస్తవానికి డబ్బులు వసూలు చేసి, బడుగు దళిత మైనార్టీ నాయకుల పేరు మీద వ్యాపార చక్రం తిప్పిన నాయకులు మొత్తం దొరల్లాగా తప్పించుకున్నారు. కానీ ఇవ్వాళ సెబి నోటీసులు ఇచ్చిన లిస్టు చూస్తే , అభ్యుదయం ఎంత తెలివైన పని చేసిందో అనిపిస్తుంది. టెన్ టీవీ లో ప్రజా ధనాన్ని అక్రమంగా వసూలు చేసి, షేర్ హోల్డర్స్ అనుమతి లేకుండా షెల్ కంపెనీలు పెట్టి సాగించిన షేర్ బదలాయింపులు అక్రమం అని, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం తప్పు పట్టి, బాధ్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

అభ్యుదయ బ్రాండ్ కాస్టింగ్ లిమిటెడ్, ప్రగతి బ్రాండ్ కాస్టింగ్ లిమిటెడ్ పేరుతో ప్రజల నుండి కోట్లాది రూపాయలను, సెబి నిబంధనలకు విరుద్ధంగా సేకరించ డాన్ని తప్పు పట్టి, సంబంధిత కంపెనీ బాధ్యులుగా వ్యవహరించిన ఇద్దరు డైరెక్టర్లకు, ఏడుగురు బోర్డు మెంబర్లకు.. మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు? సమాధానం చెప్పాలి అంటూ నోటీసులు ఇచ్చింది.

ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా వినబడుతున్న స్ఫూర్తి కమ్యూనికేషన్స్ -అభ్యుదయ బ్రాండ్ కాస్టింగ్ లిమిటెడ్- ప్రగతి బ్రాండ్ ఫాస్టింగ్ లిమిటెడ్… ఈ మూడు కంపెనీలు సరైన బాడీ మెంబర్స్ కానీ, సక్రమమైన ఆఫీస్ అడ్రస్ కానీ లేకుండా, ఒకదానికి ఒకటి తెలియకుండా 1956 కంపెనీ యాక్ట్ సెక్షన్ 56 (1) , 56 (3), 60, 64 (2) 67 (3) మరియు 73 (1)& (3) ప్రకారం దుర్వినియోగం, మోసం అని అభియోగాలు మోపారు.

అంతేకాకుండా వసూలు చేసిన షీట్లను , సదరు షేర్ హోల్డర్స్ కి తెలియకుండా బహిరంగ ప్రకటన చేయకుండా.. అమ్మడం లేదా బదలాయింపు చేయడం కూడా, సెబి రెగ్యులేషన్ యాక్టు నిబంధనలను తుంగలో తొక్కినట్లు అని సెబి ఆరోపించింది. విషాదం ఏమిటంటే.. పాలమ్మినోడు.. పూలు అమ్మినోడు.. రిక్షా పుల్లర్ ..సంఘటిత.. అసంఘటిత కార్మికులతో సహా, ఎంతో రూపాయలు వేసి కూలినాలి చేసి, దిక్కు ముక్కు లేని జనం కూడా, తమ పార్టీ ఏదో మంచి చేస్తుంది అని ఆసరా అయ్యారు.

ఆఖరికి నట్టేట ముంచింది నమ్ముకున్న నాయకత్వం, వేలాది మంది దగ్గర షేర్స్ డబ్బు వసూలు చేసి, కేవలం 445 మంది మాత్రమే షేర్ హోల్డర్స్ గా తమ అనుయాయులను ఏర్పాటు చేసుకొని, ఎవరికి కనీస సమాచారం ఇవ్వకుండా ఒక కంపెనీ నుండి, ఇంకొక కంపెనీకి అక్రమ బదలాయింపు షేర్ కంపెనీలు పెట్టి, సెబి నియామకాలను ఉల్లంఘన చేయడం మరొక నేరం. సదరు అక్రమాలు తప్పు అని స్టేట్ కమిటీ నుండి సెంట్రల్ కమిటీ దాకా చర్చ జరిగింది. ఇంత జరిగినా బాధ్యులు మాకేమి తెలియదు అని రీతిలో తప్పించుకున్నారు.

ఒక బాధ్యత కలిగిన కమ్యూనిస్టు పార్టీ , అక్రమంగా డబ్బులు వసూలు చేయడం ఘోరమైన తప్పు. వసూలు చేసిన సొమ్ము రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ఇంకొక తప్పు పని. వసూలు చేసినimage సొమ్ము, సంబంధిత వ్యక్తులకు వాపసు చేయడం ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు పార్టీ చేయాలి. అదేమీ చేయకుండా అసలు తప్పే జరగలేదు అని, మసిపూసి మారేడు కాయ చేసే నాయకుల వల్ల, కొందరు సీనియర్ నాయకులు పార్టీ వీడేందుకు కూడా సిద్ధపడటం పేపర్లలో చూస్తున్నారు.

ప్రజాస్వామ్యబద్దంగా నడపాల్సిన పార్టీని, ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చేసిన ఈ పార్టీలు- మనుషులు, పెట్టుబడిదారీ సమాజం మీద ఎలా పోరాడుతారు? షెల్ కంపెనీలు పెట్టిన మీరు, అంబానీ -ఆదానిల మీద ఏ నైతికతతో సమరశీల పోరాటాలు చేయబోతున్నారు? నెపోటిజం.. ఎవరేం చేస్తారులే అని అహం.. ముఠా తత్వం.. ఆఖరికి పార్టీలో తమకు అనుకూలమైన వారిని , కీలక స్థానంలో ఉంచి పార్టీకి విచ్చలవిడితనం అంటించారు.

పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సింది పోయి, లిమిటెడ్ కంపెనీగా మార్చింది ఎవరు? పాసింజర్ మీద సమరశీల పోరాటాలు చేయాల్సింది పోయి, పాలకవర్గ అడుగులకు మడుగులొత్తడం ఎవరి కార్యాచరణ? అంచంచలమైన విశ్వాసం ఉన్న కేడర్, ఎందుకు అధికార పార్టీ ప్రాపకాల కోసం యాక్షన్ చేస్తుంది? ఈ పాపం ఎవరిది?

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )

LEAVE A RESPONSE