Suryaa.co.in

Telangana

పొదుపు సంఘాలకు డబ్బులు ఇస్తున్నాం

– ఓవైసీని ఓడించడమే లక్ష్యం
– భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి

పొదుపు సంఘాల మహిళలతో సమావేశంలో అనేక సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. కేసీఆర్ సర్కార్ రేషన్ కార్డులు గత పదేళ్లుగా ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫించన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి.. ఇంత వరకు ఆ ఊసే లేదు.

పొదుపు సంఘాలకు డబ్బులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటిలు తెలంగాణ ప్రజల పట్ల గారడీగా మారాయి. ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకుంటుందో స్పష్టత లేదు. అప్పులు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఖమ్మం లోక్ సభ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీకీ చెమటలు పట్టిస్తాం. 17కు 17స్థానాలు గెలిచేలా మా ఎన్నికల కార్యాచరణ ఉంటుంది. హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీని ఓడించడమే లక్ష్యంగా భాజపా ముందుకు వెళ్తుంది.

LEAVE A RESPONSE