Suryaa.co.in

Andhra Pradesh

పార్టీకి సేవ చేసిన వారిని పార్టీ ఎన్నటికీ మరిచిపోదు

– పార్టీ ప్రతిమలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న కంభం వాసి హుస్సేన్ పీరాకు రూ.2 లక్షల ఆర్ధిక సాయం చేసిన చంద్రబాబు
పార్టీపై అభిమానంతో గత 40 సంవత్సరాలుగా ప్రతిమలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న కంభం వాసి సయ్యద్ హుస్సేన్ పీరా కు తెదేపా అధినేత చంద్రబాబు రూ 2 లక్షల ఆర్ధిక సహాయం అందించారు. తనకు వచ్చే ఫించనుతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ సగం డబ్బులతో పార్టీ ప్రతిమలు తయారు చేస్తూ పార్టీ అభిమానులకు, నాయకులకు ఉచితంగా పంపిణీ చేస్తూ పార్టీపై తన అభిమానం చాటుకున్న సయ్యద్ పీరా సేవలు కొనియాడదగినవని బాబు ప్రశంసించారు. ఎనభై సంవత్సరాలు పైబడిన వయసులో కూడా పార్టీకి సేవ చేస్తున్నా పీరా లాంటి కళాకారులు ఉండటం పార్టీ అదృష్టమన్నారు. పార్టీ ఆవిర్జావం నుంచి ఒక కార్యకర్తగా, కంభం పట్టణ ప్రెసిడెండ్ గా, రామదండు కార్యకర్తగా, మార్కాపురం డివిజన్ పరిశీలకుడిగా, మండల కన్వినర్ గా, తెలుగు యువత అధ్యక్షుడిగా పీరా విశేష సేవలు అందించారు. పార్టీకి సేవ చేసిన వారిని పార్టీ ఎన్నటికీ మరిచిపోదు. పీరా కుమారుడు నూరుల్లాఖాద్రి సైతం కంభం మండల టిడిపి ప్రధాన కార్యదర్శిగా పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు.

LEAVE A RESPONSE