Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి

-లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన వెంకటగిరి ప్రముఖులు

నెల్లూరుః విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరు కలిసి రావాలన్న నారా లోకేష్ పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి రూరల్ మండల ఎంపీపీ తంబిరెడ్డి తనూజా రెడ్డి, ఆమె భర్త శివారెడ్డితో పాటు 20 కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. నెల్లూరులోని పీఎస్ఆర్ కల్యాణమండపం వద్ద యువగళం క్యాంప్ లో వీరికి పసుపు కండువాలు కప్పి యువనేత సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలనే తరిమివేశారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరం కృషిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీలో చేరిన వారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపునకు కృషిచేయాలని కోరారు.

పార్టీలో చేరిన వారిలో వెంకటగిరి వైస్ ఎంపీపీ భూపతి సుధాకర్, ఎంపీటీసీ గోగుల మల్లికార్జున్, సీనియర్ నాయకులు గొట్లకుంట రామచంద్రారెడ్డి, పులి సుబ్రహ్మణ్యం రెడ్డి, గున్నేరి జనార్థన్ రెడ్డి, కాపిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటగిరి సొసైటీ మాజీ అధ్యక్షులు తోట మురళీకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి మండల పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE