Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ కథ ముగిసింది

అవినీతికి పెట్టింది పేరు కాంగ్రెస్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదు
6 గ్యారంటీలకు దిక్కు లేదు
మహిళలకు రూ. 2500 హామీ ఏమైంది?

– తూప్రాన్ రోడ్ షో లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి.అవి ఢిల్లీ సంబంధించిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతా ప్రయాణిస్తున్నాం. దేశానికి మోదీ ఎంతో సేవ చేశారు. టాయిలెట్ నుండి చంద్రయాన్ వరకు నరేంద్ర మోడీ చేయని అభివృద్ది కార్యక్రమం లేదు. పేదలకు ఉచితంగా ఇళ్లు, గ్యాస్, బియ్యం అందించారు. అయుష్మాన్ భారత్ పేదలకు రూ.5లక్షల ఆరోగ్య భీమా అందించారు.

జాతీయ రహదారుల నిర్మాణం, గ్రామ పంచాయితీలలో అభివృద్దికి కేంద్రం నిధులు ఇస్తుంది. ఏడాదికి రైతులకు మోడీ రూ. 6 వేల ఇస్తున్నారు. హైదరాబాద్ తో సహా దేశంలో అనేక చోట్ల ఉగ్రవాద దాడులు జరిగేవి. దేశాన్ని మోడి శాంతియుత దేశంగా మార్చారు. పాక్ ఉగ్రవాదుల ఆటకట్టించారు. పదేళ్లుగా దేశం శాంతియుతంగా ఉంది. దేశంలో అందరూ సంతోషంగా ఉంటున్నారు. దానికి కారణం మోడీ. దేశంతో మెుత్తం మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.

తెలంగాణలో 17 సీట్లను గెలిచే ప్రయత్నం చేస్తు్న్నాం.తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వం కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ కథ ముగిసింది. ఆ పార్టీ తెలంగాణకు అవసరం లేదు. అవినీతికి పెట్టింది పేరు కాంగ్రెస్. ఆ పార్టీ నేతల అవీనితి పరులు.
కాంగ్రెస్ ఉన్న 40 సీట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు రావు. దేశం గాడీలో ఉండాలంటే మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే మోడీ నాయకత్వాన్ని ఆశీద్వారించాలి. రాజకీయాల అతీతంగా ఆలోచన చేయండి. మెదక్ పార్లమెంట్ లో బీజేపీ గెలవాలి.

దేశంలో అనేక సమస్యలను మోదీ పరిష్కారించారు. అవీనితి లేని పాలన అందిస్తు్న్నారు.
ప్రపంచ వ్యాప్తంగా యూరియా ధరలు పెరిగాయి. కానీ పెరిగిన ధరలను కేంద్రమే సబ్సిడీ భరిస్తుంది. ఎరువుల మీద అత్యధిక సబ్సిడి అందిస్తుంది కేంద్రం. రూ.2లక్షల రుణ మాఫీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేస్తుందో చెప్పాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదు.

6 గ్యారంటీలకు దిక్కు లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారు? మహిళలకు రూ. 2500 హామీ ఏమైంది?

గ్యారంటీలతో గారడి చేస్తున్నారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు వదిలిపెట్టారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ 4 ఎంపీ సీట్లు బీజేపీ గెలువబోతుంది. ఇక కర్ణాటకలో గ్యారంటీల పేరుతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది.
ఇప్పుడు కర్ణాటక బీజేపీ వైపు ఉంది. 25 ఎంపీ సీట్లను బీజేపీ గెలవబోతుంది. తెలంగాణలో అదే పరిస్థితి. దేశంలో అభివృద్ది చెందాలంటే మోడీ మళ్లీ రావాలి. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ నుండి బీజేపీని గెలిపించాలి.

 

LEAVE A RESPONSE