– ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి
– నువ్వు సక్కగా పాలన చేస్తే జర్నలిస్టులు రైతులు నిన్ను తిట్టేవారు కాదు కదా
– అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు లక్షల పిచ్చి కుక్కలు ఉన్నాయి. ఆ పిచ్చి కుక్కల అధ్యక్షుడే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతోంది. మా పొలం ఎండిపోతుంది ట్యాంకర్ తో నీళ్ళు పెడుతున్నాం అని చిన్నపిల్లవాడు చెప్తున్నాడు. 4వేల పెన్షన్ వస్తుంది అనుకుంటే, ఇప్పుడు 4ఎకరాల పంట ఎండిపోతుంది అనుకోలేదని ఆ చిన్నపిల్లవాడు చెప్తుంటే గుండె తరుక్కుపోతుంది.
పంటలు ఎండిపోతుంటే కనీసం నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కెసిఆర్ హయాంలో వచ్చిన కరెంటు రైతుబంధు ఎందుకు రావడం లేదు. కేసీఆర్ మీద ఉన్న ఖర్చుతోనే పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు వదలక పోతే రైతులను తీసుకొని నేను రోడ్డెక్కుతా. కేసీఆర్ కంటే గొప్ప పాలన చేసే ప్రయత్నం చేయాలి కానీ ఇలాంటి పరిస్థితులు రాకూడదు.
15 నెలల స్కాం గ్రేస్ పాలన 15 నెలలు 15 స్కాములు జరిగాయి. ఈ స్కాంగ్రెస్ పాలలను ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ తెచ్చిన పేరే కెసిఆర్ కు కొండంత పేరు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ అభివృద్ధిని దేశానికి చూపెట్టారు కేసీఆర్. సిగ్గు శరం లేకుండా రేవంత్ రెడ్డి కేసీఆర్ విమర్శిస్తున్నారు.
ప్రతిపక్ష నేతను చావు కోరుతున్నాడు. వందల మంది ఎల్ఓపి లీడర్లు అయ్యారు కానీ ఎవరూ కూడా చావును కోరుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల పిచ్చికుక్కలు ఉన్నాయి. ఆ పిచ్చి కుక్కల అధ్యక్షుడే రేవంత్ రెడ్డి. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. కొండను చూసి కుక్కలు మొరిగితే కొండకు చేటా? కెసిఆర్ చావాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ కానీ కేసీఆర్ చచ్చే వ్యక్తి కాదు తెలంగాణను చావు నోట్లో తలపెట్టి తెచ్చిన వ్యక్తి కేసీఆర్.
కెసిఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత అయ్యేవాడా నీకు రాజకీయ బిక్ష పెట్టింది కేసీఆర్ అనే విషయం గుర్తు పెట్టుకో. ఆరు గ్యారంటీలో పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేశారు. ప్రజలు పెడుతున్న శాపనార్థాలకు కుక్క చావు చచ్చేది రేవంత్ రెడ్డి.
రైతులు రైతుబంధు రాలేదని రుణమాఫీ కాలేదని నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని ఒక జర్నలిస్టు కి ఇంటర్వ్యూ ఇస్తే, ఆ జర్నలిస్టును బెయిల్ రాకుండా కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇది ప్రజాస్వామ్యమా? నువ్వు సక్కగా పాలన చేస్తే జర్నలిస్టులు రైతులు నిన్ను తిట్టేవారు కాదు కదా? ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.