Suryaa.co.in

Andhra Pradesh

సోమిరెడ్డిపై హత్యాయత్నం బాధాకరం

-వైసీపీ రౌడీల బరితెగింపునకు ఈ దాడి నిదర్శనం
-చర్యకు ప్రతి చర్య ఉంటుందని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి
– తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌పై వైసీపీ గూండాల దాడి వైసీపీ నేతల సైకో చేష్టలకు నిదర్శనం. సోమిరెడ్డిపై వైసీపీ నేత వెంకటయ్య, అతని అనుచరులు దాడి చేయడం దుర్మార్గం. టీడీపీ సమావేశం వద్ద వైసీపీ నేతలు కర్రలు, రాడ్లతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు? సోమిరెడ్డిపై హత్యాయత్నాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో.. టీడీపీ నేత మహేంద్ర ఇంటికి వెళ్లి అతనిపై దాడి, కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇదేం సంస్కృతి జగన్ రెడ్డీ?

దాడులు చేసే వారిని, హత్యలు చేసే వారిని జగన్ రెడ్డి ప్రోత్సహించడం వల్లనే వైసీపీ గూండాలు పెచ్చుమీరిపోతున్నారు. గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌పై రకరకాల ఆరోపణలు చేసి, ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ కోర్టు నుండి మాయం చేశారు. ఇప్పుడు ఏకంగా సోమిరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించడం వెనుక స్థానిక వైసీపీ నేతల హస్తం ఉంది. ఈ ఘటనకు స్థానిక మంత్రే బాధ్యత వహించాలి.

దాడులు చేస్తాం, హత్యలు చేస్తామంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. జగన్ రెడ్డి ప్రోద్బలంతో వైసీపీ ముఠా చేసిన ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇంకో 40 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడం తధ్యం. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన ఏ ఒక్కరినీ వదలకుండా చర్యలు తీసుకోవడం కూడా తధ్యం.

LEAVE A RESPONSE