Suryaa.co.in

Andhra Pradesh

ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ

– ఇండియా నిఘా వ్యవస్థలను మోడీ వ్యవస్థలుగా మార్చారు
– ఇండియా ఇంటలిజెన్స్ అంతా మోడీ కోసం పని చేస్తుంది
– మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పని చేస్తుంది
– మోడీ,అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి
– వీళ్లకు పాలన చేసే హక్కు లేదు
– చౌకీదార్ మోడీ దేశానికి కాదు..కేవలం బీజేపీ కి మాత్రమే
– ఏపీసీసీ చీఫ్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

అమరావతి: ఇది మనం దేశం మీద జరిగిన దాడి. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారు.పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కాశ్మీర్ కి వెళ్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు ? ఇది ముమ్మాటికి భద్రత లోపమే. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్ళు లేనే లేరు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు లేనే లేరు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదు.

ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమే. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీ పై ఉంది. మోడీ చౌకీదార్ అని చెప్పుకుంటున్నారు. ఇదేనా చౌకిదార్ తనం? ఈ ఘటనకు అమిత్ షా, మోడీ బాధ్యత వహించాలి. రాజీనామాలు చేయాలి. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్. ఇవ్వాళ దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పని చేయడం లేదు.

ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్నా వల్ల మీద వాడుతున్నారు. బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద వాడుతున్నారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణం. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదు. వీళ్ళు దేశానికి చౌకీదార్ కాదు..బీజేపీ కి చౌకి దార్లు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా మోడీ కోసం పని చేస్తుంది.

దేశ భద్రతను గాలికొదిలేశారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమే. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారు. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారు. ఈ దేశంలోనే ఇంటర్నల్ గా భద్రత లేదు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ. మోడీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టీ ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదు.

LEAVE A RESPONSE