ఇదీ అమరావతి.. విశాఖకు తేడా!

మా జిల్లా విశాఖపట్నం . మా ఊరు విశాఖపట్నం అంటే నాకు చాలా ఇష్టం. మా చుట్టాలు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు. అయినాసరే రాజధానిగా అమరావతే ఉండాలని కోరుకుంటున్నాను* ఎందుకంటే నేను ఆంధ్రుడుని,ఆంధ్ర రాష్ట్రం బాగు కోరుకునేవాడిని.

రాజధానిని అమరావతిలోనే ఎందుకు ఉంచాలి…?
1 అమరావతి
ఇప్పుడు నడుస్తున్న రాజధాని.
విశాఖపట్నం
మళ్లీ అన్నీ మొదలుపెట్టాలి.

2 అమరావతి
ముంపు లేదు
విశాఖపట్నం
తుఫానులు వచ్చే అవకాశం ఇప్పటికే హుద్ హుద్ తుఫాను వలన విశాఖపట్నం ఒకసారి కకావికలం అయ్యింది.

3 అమరావతి
తీరానికి 80 కిలోమీటర్ల పైగా దూరంగా ఉంది.
రేపు ఏదైనా శత్రుదేశాల తోటి యుద్ధం వచ్చినప్పటికీ రక్షణ పరంగా టార్గెట్ కాదు కాబట్టి భయం లేదు.
విశాఖపట్నం
దేశం మొత్తం మీద తూర్పు తీరాన రక్షణ పరంగా ఉన్న అతి కీలకమైన ప్రదేశం.
బోలెడన్ని సైనిక కేంద్ర స్థావరాలు ఉన్నాయి. శత్రుదేశంతో యుద్ధం అంటూ జరిగితే మొదట బలి అయ్యేది విశాఖపట్నమే.

4.అమరావతి
(గుంటూరు జిల్లా) అటు 06జిల్లాలు ఇటు 06 జిల్లాల మధ్యలో ఉంది.
ఎమ్మెల్యేలు
84 ఒకవైపు
74 ఇంకోవైపు
ఎంపీలు
అటు 12 మంది,
ఇటు 12 మంది
దూరం
అటు 600 కిలోమీటర్లు
ఇటు 600 కిలోమీటర్లు.
జనాభా
2.35కోట్లు ఒకవైపు,
2.15కోట్లు ఇంకొక వైపు.
అమరావతి:
మొత్తం రాష్ట్రానికి నడిబొడ్డున ఉంటుంది.

విశాఖపట్నం (జిల్లా)
10జిల్లాలు ఒకవైపు,
02 జిల్లాలు ఒకవైపు.
దూరం
1000 కిలోమీటర్లు ఒకవైపు,
100 కిలోమీటర్ల ఇంకో వైపు
జనాభా
3.5కోట్ల జనాభా ఒకవైపు 50 లక్షల జనాభా ఇంకొక వైపు
ఎమ్మెల్యేలు
141ఒకవైపు 19 ఇంకోవైపు
ఏ రకంగా చూసినా విశాఖపట్నం అందరికీ అన్నిటికీ దూరంగా ఉంటుంది
5 అమరావతి
కృష్ణా నది ఒడ్డున ఉంది. నీటికి కొరత లేదు.
విశాఖపట్నం
నీటి కొరత ఉంది.
6 అమరావతి
ఇప్పటి జనాభా 01లక్షలోపు మాత్రమే. ఎంతపెరిగినా10లక్షలు మించదు.
అలాగే,సమగ్రమైన ప్రణాళిక వుంది కాబట్టి కాలుష్యం ఉండదు.
విశాఖపట్నం ఇప్పటి జనాభా 25 లక్షలు.
పెరిగి పెరిగి 50 లక్షలు అవుతుంది. ఉన్న ఊరును పెంచుకుంటూ పోవటం వలన, అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాలుష్యం పెరిగిపోతోంది.

ఏవిధంగా చూసినా అమరావతిలోని రాజధానిని కదిలించడం ముమ్మాటికీ, కుటిలమైన రాజకీయ వికృతక్రీడ, మూర్ఖత్వం. అమరావతిలో ఉన్నంత విశాలమైన రహదార్లు ఢిల్లీలో కూడా లేవు… భూగర్భ కేబుల్ వ్యవస్థతో ఒక్క కరెంటు వైరు కూడా బయటకి కనిపించకుండా నిర్మించారు. భూమికి పాతికఅడుగుల క్రింద నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో దోమలవలన, అపరిశుభ్రతవల్ల వచ్చే రోగాలు అమరావతి దరిదాపుల్లో వినిపించవు. కనీసం అమెరికాలో కూడా ఇంత పక్కా ప్రణాళికతో నిర్మించిన నగరంలేదు. వచ్చే వందేళ్లవరకు నీటికోసం చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాల్లా కటకటలాడాల్సిన పనికూడా లేకుండా కృష్ణమ్మఒడ్డున భూదేవిసైతం నివ్వెరపోయేలా..ఆకాశం అచ్చెరువొందేలా …ప్రపంచదేశాలు మనవైపు చూసేలా, భూతలస్వర్గం అనిపించుకునేలా మన అమరావతి పునర్నిర్మాణం తధ్యం. ఆంధ్రుల రాజధాని అమరావతి.

– శోభారాణి బొర్రా
తెలుగు కళాసమితి

Leave a Reply