సీఎం పులివెందులలో గెలిస్తే అదే గొప్ప

-వైకాపా గడప గడపలో గడబిడ
-బస్సు యాత్ర తుస్సు మంది
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్క్లింగ్ ప్రెసిడేంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

విజయవాడ : రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ ఉంటుందని విజయ సాయి రెడ్డి, సజ్జల చెప్పడం హాస్యస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్క్లింగ్ ప్రెసిడేంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. 174 స్థానాలలో గెలుపు దేవుడెరుగు. ముందు సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో గెలిస్తే అదే గొప్ప అని పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గంలో వైయస్సార్ ఘాట్ ఉన్న ఇడుపులపాయ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు గ్రామ సచివాలయానికి నిన్న తాళాలు వేశారని, పులివెందుల అసెంబ్లీ ప్లీనరీ లోనే నిరసన ధ్వనులు మిన్నంటాయని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

గడప గడపలో గడబిడ జరుగుతోందని, బస్సు యాత్ర తుస్సు మందని ఎద్దేవా చేశారు. ఎందుకు వైకాపా కు ఓట్లు వేయాలి? అని ప్రశ్నించారు. నవరత్నాలు నకిలీ రత్నాలు అయినందుకా?… రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్ గా మార్చినందుకా?… బిల్లు ముట్టుకుంటే నే షాక్ కొట్టే విధంగా కరెంటు ఛార్జీలు పేంచినందుకా?. రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను మోసగించి నందుకా?. కాంట్రాక్టర్లను బిక్షం ఎత్తుకునే లా చేసినందుకా? అని నిలదీశారు.

సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలు గా చేసినందుకా?. వైకాపా కార్యకర్తలనే అప్పుల పాలు చేసినందుకా?. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకా?. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినందుకా?. ప్రత్యేక హోదా సాధించ లేక పోయి నందుకా?. వ్యవసాయ మోటార్ల కు మీటర్లు బిగిస్తునందుకా?. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రిని చూసి ఓట్లు ఎందుకు వేయాలి ? అని తులసిరెడ్డి ప్రశ్నించారు.

Leave a Reply