ఏకగ్రీవం గా ఎన్నికైన ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కమిటీ

ఏపీ జేఏసీ అమరావతి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ) రాష్ట్ర కార్యవర్గానికి శనివారం కర్నూలు రెవెన్యూ భవన్ లో జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా 21 మంది కార్యవర్గ సభ్యులు ఆయా పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు చైర్మన్ గా, పలిశెట్టి దామోదర్ రావు సెక్రటరీ జనరల్ గా మొత్తం 21 పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు పరచడంతో రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జరగబోయే కౌన్సిల్ లో ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అధికారికంగా ప్రకటిస్తామని ఎన్నికల అధికారి కె.భావనా ఋషి, అసిస్టెంట్ ఎన్నికల అధికారి కృష్ణారావు తెలిపారు. ఎన్నికల అధికారికి నామినేషన్ లు దాఖలు చేసిన అభ్యర్థుల లిస్ట్ పోస్ట్ ల వారీగా చైర్మన్ గా బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ గా పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ గా టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారిగా వి.వి.మురళి కృష్టంనాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా యస్.కృష్టమోహన్ రావు, ప్రచార కార్యదర్శిగా బి.కిశోర్ కుమార్ తోపాటు 5 కో-చైర్మన్లు, 5 వైస్ చైర్మన్లుగా, 5 కార్యదర్శులుగా మొత్తం 21 మంది నామినేషన్లను నామినేషన్లు దాఖలు చేసినట్లు ఏపి జెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Leave a Reply