-సీఎండీ మొదలు ఎస్ఈల వరకు ఈ నెలనుంచే క్షేత్రస్థాయిలో పర్యటించాలి
-రైతులు, వినియోగధారులు, మీడియా మిత్రులను సమీక్ష సమావేశాల్లో భాగస్వాములను చేయాలి
-1912 ను విస్తృతంగా ప్రచారం చేయాలి
-ఎన్పిడీసిఎల్, ట్రాన్స్కో ఉన్నత అధికారుల సమీక్ష సమావేశం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: రానున్న వేసవిలో రెప్పపాటు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ప్రజా భవన్ లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో అధికారులతో రానున్న వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికాలపై సుధీర్గంగా సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రానున్న వేసవిలో విద్యుత్ అంతరాయం అనే మాట తలెత్తకుండా వినియోగధారులకు నాణ్యమైన విద్యుత్ ను నిరాటంకంగా సరఫరా చేయాలని ఆదేశించారు.
వేసవి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా సీఎండీలు మొదలు ఎస్ఈల వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా సమీక్ష, అవగాహన సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశాలలో వినియోగధారులను, మీడియా ప్రతినిధిలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. గత వేసవిలో ఎదురైన ఇబ్బందులు, వాటిని అడిగమిస్తూ రానున్న వేసవిలో సమర్థవంతంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ సమావేశాల్లో వివరించాలని ఆదేశించారు.
అధికారులు క్షేత్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను వెనువెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. 108 తరహాలోనే విద్యుత్ సరఫరాలో సమస్యల పై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన 1912 ను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. 1912 కు వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని, ఈ వ్యవస్థ నిర్వాహణ ప్రచారానికి అదనపు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఎన్పీడీసిఎల్ పరిధిలో వచ్చే మార్చిలో పీక్ డిమాండ్ 6328 మెగా వాట్ల విద్యుత్ సరఫరా చేయడానిలకి కావాలసిన అన్నీ చర్యలు ముందస్తుగా తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో వినియోగాన్ని ధృష్టిలో పెట్టుకుని పీక్ డిమాండ్ ను తట్టుకునే విధంగా ట్రాన్స్ మిషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
సబ్ స్టేషన్ల వారీగా ఓవర్ లోడ్ సమస్యలను గుర్తించి ముందుగానే వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకవేళ ఈదురు గాలుల వలన విద్యుత్ అంతరాయం ఏర్పడితే ERT (ఎమర్జెన్సీ రీస్టోర్ టీం) వాహనాలను వాడుతున్నారని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి ప్రతీ ఒక్కరూ అహర్నిశలు కష్టపడుతున్నారని ట్రాన్స్కో, ఎన్పీడీసిఎల్ అధికారులను అభినందించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ డీ. కృష్ణ భాస్కర్, ఎన్పీడీసిఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ట్రాన్స్కో, ఎన్పీడీసిఎల్ డైరెక్టర్లు, ఇతర ముఖ్య ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ ముందస్తుగా అన్నీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా వినియోగధారులకు అందజేస్తామని అన్నారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ అధికారుకు పర్యటించి వినియోగధారులతో సమావేశాలు ఏర్పాటు వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఒకవేళ విద్యుత్ సమస్యలు తలెత్తినా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించే ఏర్పాట్లు చేయడం వలన వినియోధారులకు ఎటువంటి విద్యుత్ అంతరాయలు ఉండవన్నారు.
ట్రాన్స్కో సీఎండీ డీ. కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేస్తూ 132/33 కేవి సబ్ స్టేషన్ల లో కావాల్సిన సామర్థ్యం మేరకు పవర్ ట్రాన్స్ ఫార్మర్ లను పెంచుతున్నామని, దీని వలన వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా ఎటువంటి అంతరాయలు ఏర్పడవని ఈ సందర్బంగా వివరించారు. ముందస్తుగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వలన వేసవిలో లోడ్ పేరిగినా ఎటువంటి అంతరాయలు ఉండవని స్పష్టం చేశారు.
తదనంతరం ఎన్పీడీసిఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలానికి సంబందించి మార్చి నెలలో 6,328 ల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందన్న అంచనా మేరకు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా 44 పవర్ ట్రాన్స్ ఫార్మర్ ల సామర్థ్యం పెంపు, మరో 32 వచ్చే నెల వరకు పూర్తి చేస్తామని తెలిపారు. 33 కేవి 13 ఓవర్ లోడ్ ఫీడర్స్, 11 కేవి 35 ఓవర్ లోడ్ ఫీడర్స్ కూడా లోడ్ రిలీఫ్ చేశామని అన్నారు. ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంపు, ప్రత్యామ్నాయ లైన్ల ఏర్పాటు, 17 కొత్త సబ్ స్టేషన్ ల ఏర్పాటు, రాబోయే మార్చిలో 12 కొత్త సబ్ స్టేషన్ల ప్రారంభం చేస్తామని అన్నారు.