తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం దంచి కొడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో విజృంభించింది.. దీంతో, ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయి వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. మరో పక్క, ఈదురు గాలులతో కూడిన వర్షం కావడంతో పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. ఈ క్రమం లోనే విద్యుత్ వైర్లు తెగిపడి పలుచోట్లు కరెంట్ అంతరాయం కూడా ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు పోలీసు శాఖ కీలక హెచ్చరిక చేసింది. ”రాష్ట్రం లోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. పిడుగుల ప్రమాదం దృష్ట్యా చెట్ల కింద ఉండటం, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాకటం చేయవద్దు.. శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలి. అత్యవసర సమయాల్లో Dial100 కు కాల్ చేయాలి” అని సూచనలు చేశారు..
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…