Suryaa.co.in

Andhra Pradesh

శ్రీశైల మల్లికార్జునస్వామికి వేమిరెడ్డి దంపతుల స్వర్ణ రథం

శ్రీశైలం : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం దీనిని మల్లన్నకు కానుకగా సమర్పించనున్నారు. 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ తాపడం చేయించిన ఈ రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు కొలువుదీరాయి. స్వామి, అమ్మవార్ల చుట్టూ అష్టదిక్పాలకులు, ముందుభాగంలో రెండు పెద్ద అశ్వాలు స్వారీ చేస్తున్నట్లు తీర్చిదిద్దారు.

8 నందులు, వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణు, దుర్గ, లింగోద్భవ శివుడి మూర్తులు కనువిందు చేస్తున్నాయి. శ్రీశైలం దేవస్థానానికి తొలిసారిగా స్వర్ణరథం సమకూరింది. ఇప్పటివరకు స్వామి, అమ్మవార్లకు వెండిరథంపైనే ఊరేగిస్తున్నారు. దాతలు శుక్రవారం ఈ రథాన్ని దేవస్థానానికి అప్పగించిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దానిని ప్రారంభిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. సుమారు రూ. 11 కోట్ల వ్యయంతో ఈ స్వర్ణరథాన్ని తయారు చేయించినట్లు సమాచారం.

LEAVE A RESPONSE