వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే…ఓవైసీకి ఉలుకెందుకు..?

-VHP ప్రచార సహ ప్రముఖ్ బాలస్వామి

ప్రఖ్యాత జ్ఞానవాపి మందిరం విషయంలో ఎం.ఐ.ఎం అధినేత, హైదరాబాద్ ఎం.పీ అసదుద్దీన్ ఓవైసీ తీరు చూస్తుంటే జాలి వేస్తోంది. “గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు” వ్యవహరించడం సిగ్గుచేటు. ఇన్నాళ్లు మసీదుగా మార్చుకొని ఉన్న ప్రదేశంలో శివలింగంతో పాటు మిగతా నంది ,హిందూ కట్టడాలు బయటపడటం జీర్ణించుకోలేక ఓవైసీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాను రాజ్యాంగంపై గౌరవం ఉన్న వ్యక్తిని అంటూనే… కోర్టు తీర్పులను తప్పు పడుతూ వ్యాఖ్యానించడం ఓవైసీకి తగదు. “నాకు రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది.. కాబట్టి నేను మాట్లాడుతాను” అంటూ కోర్టు తీర్పుపై విమర్శ చేయడం నేరం.

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మందిరం కాంప్లెక్స్ లో గల బావిలో పవిత్రమైన శివలింగం బయటపడింది. కోర్టు ఆదేశాల మేరకే ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే చేస్తుండగా సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ శుభ పరిణామాన్ని ప్రపంచమంతా ఆహ్వానించింది. హిందూ సమాజం అంతా హర్షిoచింది. మరీ ముఖ్యంగా శివలింగం బయటపడిన ప్రాంతాన్ని, బావిని సీల్ చేసి.. అక్కడకు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని వారణాసి కలెక్టర్, పోలీస్ కమిషనర్, సి ఆర్ పిఎఫ్ కమాండోలను సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ ఆదేశించారు కూడా.

అయితే కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఓవైసీ మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం. అయోధ్యలోని బాబ్రీ మసీదు లాగా జ్ఞానవాపి మసీదును కానివ్వబోమని అసదుద్దీన్ వ్యాఖ్యానించడం తీవ్ర ఆక్షేపణీయం.కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేస్తున్నా…. చట్టాన్ని ఉల్లంఘించి సర్వే చేస్తున్నట్లు ఆయన ఆరోపణ, వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి.”మోదీకి, యోగికి నేను భయపడను అంటూ మాట్లాడే ఆయన మాటల్లోనే భయం కనిపిస్తోంది”.
నేను అంతరాత్మను అమ్ముకోను.. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అంటూనే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, కోర్టు తీర్పు పై మాట్లాడడం చట్టవిరుద్ధం.

1991 చట్టం రద్దుచేసి హిందూ అస్తిత్వం కాపాడాలి…
హిందువుల మనోభావాలు దెబ్బ తీసి, హిందూదేవాలయాలు, భూములు, ఆస్తులు కోల్పోయేలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన “చట్టం -1991 లోని సెక్షన్ 4 (2)” వెంటనే సవరించి హిందూ దేవాలయాలను, హిందూ ఆస్తులను మొత్తంగా హిందూ అస్తిత్వాన్ని కాపాడాలి. “ఇది ముమ్మాటికీ ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన చట్టం” అని ఓవైసీ గుర్తించాలి.

బాబ్రీ మసీదు లాక్కోలేదు… పోరాడి సాధించుకున్నము..!
ఆర్.ఎస్.ఎస్ ,బిజెపి కుట్రలు పన్ని అయోధ్య బాబ్రీ మసీదు లాక్కోన్నాయని… వాటి తరహాలోనే జ్ఞానవాపి మసీదును లాక్కునేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఓవైసీ ఆరోపించడం ఆయన అవివేకానికి నిదర్శనం. వాస్తవానికి అయోధ్యలో రామజన్మభూమి కోసం వందల సంవత్సరాల పోరాటం చేసి, లక్షలాది మంది హిందువులు ప్రాణత్యాగం చేసి ,చివరకు న్యాయబద్ధంగా రామ జన్మభూమిని సొంతం చేసుకున్నాం అనే విషయం ఓవైసీ తెలుసుకోవాలి.

జ్ఞానవాపి విషయం ఇంకా కోర్టులో ఉండగానే కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా, అసహనం వెళ్లగక్కడo ఓవైసీ డొల్లతనానికి నిదర్శనం. ముమ్మాటికీ జ్ఞాన వాపి అనేది మందిరమే. న్యాయబద్ధంగా పోరాడి మందిరాన్ని సాధించుకు తీరుతాం. మొగలుల పాలనలో ధ్వంసమైన దేవాలయాల గురించి మాత్రమే మా పోరాటం. మొగలులు నిర్మించుకున్న మసీదులు మాకు అక్కరలేదు. “లక్షల కొద్దీ దేవాలయాలు దాడులకు గురయ్యాయి, ధ్వంసమయ్యాయి, దోపిడీ జరిగింది. మెజారిటీగా ప్రతి మసీదు కింద ఓ దేవాలయం ఉంది. ఇది చరిత్ర చెప్పే సత్యం.. పురావస్తు శాఖ చెప్పే సాక్ష్యం”..!

ఈ సత్యం కఠినంగా ఉన్నా గుండె దిటవుగా చేసుకుని ఓవైసీ వాస్తవాలు అర్థం చేసుకొని తీరాల్సిందే..!

భవదీయ
పగుడాకుల బాలస్వామి
ప్రచార సహ ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్ పరిషత్ (VHP) తెలంగాణ
9912975753..9182674010

Leave a Reply