– సెక్రటేరియట్ లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: విజయదశమి పురస్కరించుకుని డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి,సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం.డి సిహెచ్.ప్రియాంక,ఆర్ అండ్ బి ఈఎన్సి లు మోహన్ నాయక్,జయ భారతి,సి.ఈ లు రాజేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,బి.వి రావు,లింగారెడ్డి,కిషన్ రావు,పలువురు ఆర్ అండ్ బి అధికారులు,రాష్ట్ర సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,జనరల్ సెక్రటరీ ప్రేమ్ పలువురు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.