చంద్రబాబు ఉగ్రవాది.. అసాంఘీక శక్తులకు రారాజు

– బాబుకు అపాయింట్ మెంట్లు ఎందుకు దొరకలేదు.. అందరూ మొహం మీదే తలుపులు ఎందుకు వేశారు..?
– పట్టాభి బూతుల వీడియోలను బాబు రాష్ట్రపతికి చూపాడా..?
– ఏ ఎన్నికల్లోనూ గెలవలేని బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమంటున్నాడు..!
– టీడీపీ హయాంలో చంద్రబాబే మాదక ద్రవ్యాల వ్యాపారం చేశాడు.. గంజాయి వ్యాపారంలో లోకేష్ పాత్ర ఉంది
– చంద్రబాబు ట్రూ కలర్స్ తెలిసి, ఏ పార్టీ వాళ్ళూ, కేంద్ర పెద్దలు బాబును కలిసేందుకు ఇష్టపడలేదు
– తన స్వప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడైనా, ఎప్పుడైనా ఫణంగా పెట్టదగిన వ్యక్తి చంద్రబాబు
– కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 తరహాలో.. రాజ్యాంగ హోదాల్లో ఉన్న వ్యక్తులకు కూడా చట్టం తేవాలి
– పట్టాభికి బాబు నుంచి ప్రాణభయం.. అందుకే మాల్దీవులకు పారిపోయాడు
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్
విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…చంద్రబాబు ఢిల్లీ పర్యటన పేరుతో ఆంధ్రప్రదేశ్ లో నానా హడావుడి చేసి, చివరికి రాష్ట్రపతిని మొక్కుబడిగా కలిసి ఎలా వెనుదిరిగిపోయాడో అంతా చూశారు. “అసలు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చింది..? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికేమైనా వచ్చాడా..? లేక తన స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి వచ్చాడా.. ? లేక ఢిల్లీకి వచ్చి రాష్ట్ర పరువును తీశాను అని ఏపీకి వెళ్ళి చెప్పుకోవడానికి వచ్చాడా..? ఢిల్లీలో వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడానికి వచ్చాడా..? తాను తప్పు చేసి.. తప్పు చేయలేదు అని ఢిల్లీ నాయకులకు చెప్పుకోవడానికి వచ్చాడా..?” అన్నది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు.
– చంద్రబాబు గతంలో కూడా పలు సందర్భాల్లో ఢిల్లీ పర్యటనలకు వచ్చాడు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే..
1. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించినప్పుడు..
2. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీకి దొరికిపోయి ఢిల్లీకి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు..
3. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలంతో హిందీలో వాడే బోషడీకే పదాన్ని, ఆంగ్లంలో అయితే బాస్టర్డ్ అని అర్థం వచ్చే పదాన్ని తన పార్టీ అధికార ప్రతినిధులతో తిట్టించి, దాన్ని సమర్థించుకోవాడానికి చంద్రబాబు ఢిల్లీ వచ్చాడు.
కుట్రలు చేయడం, ఆ కుట్రలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ యాత్రలు చేయడమనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ రంగులేమిటి(ట్రూ కలర్స్) అన్నది ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని పార్టీలకు, కేంద్రంలోని పెద్దలకు తెలిసిపోయింది కాబట్టి, చంద్రబాబును ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదు. ఆయనను కలవడానికి కేంద్ర హోం మంత్రిగానీ, ఇతర పార్టీల పెద్దలుగానీ ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో వచ్చిన దారినే చంద్రబాబు వెనుదిరిగిన పరిస్థితి.
రాష్ట్రపతి ని కలిసిన చంద్రబాబు ఆయనకు ఏం చెప్పాడు. ” మా పార్టీ అధికార ప్రతినిధి గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి బోషడీకే అని అన్నాడని చెప్పాడా.. లేక, ఆ పదానికి చాలా మంచి అర్థం ఉందని చెప్పాడా.. లేక మా పార్టీ వాళ్ళ చేత బూతులు తిట్టించి, 36 గంటలపాటు బూతుల సమర్థన దీక్ష పెట్టి, ప్రజల కోసం, దేశం కోసం దీక్ష చేశానని చెప్పుకోవడానికి వచ్చాడా..? ” అన్నది రాష్ట్ర ప్రజలకు ఎందుకు చంద్రబాబు చెప్పలేదు.
గౌరవ ప్రధాన మంత్రి మోడీని గతంలో మీరు, మీ పార్టీ నాయకులు తిట్టినటువంటి వీడియోల సీడీని, అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు ఆయన కుటుంబం మీద రాళ్ళు వేసిన వీడియోల సీడీలను రాష్ట్రపతికి చూపించారా..?
లేక బోషడీకే అంటే అది అన్ పార్లమెంటరీ పదం కాదు.. అది చాలా మంచి పదం అని చెప్పారా..?
టీడీపీ ప్రభుత్వం హయాంలో తన సహచర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు గంజాయిపై ప్రెస్ మీట్లు పెట్టి, ఏపీ నుంచే దేశం మొత్తం గంజాయి వెళుతుందని, గంజాయికి కేంద్రంగా మారిందని మాట్లాడిన వీడియోలు చూపించారా.. ? లేక తన పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేత గౌరవ ముఖ్యమంత్రి ని తిట్టించిన వీడియోలను రాష్ట్రపతికి చూపించాడా..?
ఢిల్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు చేసిన ప్రధాన ఆరోపణః గవర్నమెంటు స్పాన్సర్డ్ టెర్రరిజం అని, రాష్ట్రంలో 356 ఆర్టికల్ ను ప్రయోగించమని.
తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి.. ఎన్టీఆర్ గారు చనిపోయేంతవరకు, ప్రతి మహానాడులో కూడా ఆర్టికల్ 356ను రద్దు చేయాలని ప్రతి సారీ తీర్మానం చేస్తూ వచ్చారు. ఎన్టీఆరే మాకు స్ఫూర్తి అంటూ ఆయనకు దండలు వేసే చంద్రబాబు.. అదే ఆర్టికల్ ను ప్రయోగించమని కోరటం అంటే దానిని టీడీపీ అనాలా.. లేక ఇంకేమైనా అనాలా? విధానాలు, సిద్ధాంతాలు లేని అదొక రాజకీయ పార్టీయేనా..?
చంద్రబాబే పెద్ద టెర్రరిస్టు. అసాంఘీక శక్తులకు రారాజు చంద్రబాబు నాయుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. టెర్రరిస్టు ముసుగు వేసుకున్న వ్యక్తి. అండర్ లైన్ చేసి చెబుతున్నా.. చంద్రబాబే టెర్రిరిస్టు. ఆ విషయం ఆయన స్టేట్ మెంట్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. రౌడీ ఎలిమెంట్స్ కు, టెర్రరిస్టు అవుట్ ఫిట్స్ కు నాయకుడు చంద్రబాబు అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే..
1- జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పూర్ లైట్ లో అంటే తక్కువ చేసి చూపించడం..
2- బూతు మాటలతో తన పార్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రిగారిని తిట్టించి.. రాష్ట్రంలో అలజడి సృష్టించి, ప్రజల మధ్య చిచ్చు రేపి, శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా చేసి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని దుష్ప్రచారం చేయడం.
3- 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబుకు ఫిల్తీ , ఫౌల్, అబ్యూజ్డ్, డెరిగేటరీ, డిఫమేటరీ… ఇటువంటి అన్ పార్లమెంటరీ పదాలు వాడకూడదని తెలియదా.. అంటే కచ్చితంగాతెలుసు. ఉద్దేశపూర్వకంగా తన పార్టీ స్పోక్స్ పర్సన్స్ చేత చెప్పించి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. అబ్యూజ్డ్ లాంగ్వేజ్ రాజ్యాంగ ఫంక్షనరీల మీద ఎక్కడైనా వాడతారో అక్కడ ప్రజలు తిరగబడతారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేమీద కేంద్ర మంత్రి నారాయణ్ రాణే… ఇటువంటి కామెంట్సే చేస్తే.. అక్కడి ప్రజలు తిరగబడ్డారు. అలానే యూపీ బీజేపీ వైస్ ప్రెసిడింట్ దయాశంకర్ సింగ్.. అప్పటి ముఖ్యమంత్రి మాయావతి మీద డెరిగేటరీ కామెంట్స్ చేసినప్పుడు కూడా ప్రజలు తిరగబడ్డారు. రాజ్యాంగ ఫంక్షనరీలు, ప్రజల చేత ఎన్నుకబడిన ప్రజా ప్రతినిధులపై అసభ్యంగా మాట్లాడితే.. తిరగబడటం అన్నది అప్పటికప్పుడు స్పాంటిన్యూస్ గా జరిగే రియాక్షన్. ఇటువంటి సందర్భాల్లో ఎవరో ప్రేరేపించాల్సిన పనిలేదు.
– మాయావతిపై అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు.. అతన్ని బీజేపీ సస్పెండ్ చేసింది. ఇక్కడ చంద్రబాబేమో పట్టాభి వ్యాఖ్యలను సమర్థిస్తూ, ఆ బూతులను పట్టుకుని ఢిల్లీకి వచ్చిన దుర్మార్గపు వ్యక్తి.
మాయావతి మీద, ఉద్ధవ్ ఠాక్రే మీద ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు కూడా… ప్రజలు భావోద్రేకానికి గురై అప్పటికప్పుడు దాడులు జరిగిపోతుంటాయి. దాడులు చేయడం కూడా తప్పు.. ఒప్పు అని ఎవరూ చెప్పరు. – చంద్రబాబు ఈవిల్ డిజైన్స్ తో, సిస్టమేటిక్ గా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. అటాక్ చేయడం తప్పు కాదని నేను చెప్పటం లేదు. రెచ్చ గొట్టవద్దని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని మేం చెబుతున్నాం. మీరు తప్పు చేసి, ఇంకొకర్ని ప్రేరేపించకూడదు.
ఇండియా సెక్యులర్ దేశం. భిన్న మతాలు, కులాలు ఉన్న దేశం. ఇక్కడ సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ప్రతి ఒక్కరి సెంటిమెంటు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. అటువంటి దేశంలో అసభ్యకరమైన భాషను వాడటం, అసాంఘీకమైన చర్యలకు దిగడం, అరాచకాన్ని సృష్టించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్ లైట్ లో చూపించే ప్రయత్నం చేయడమే చంద్రబాబు పెద్ద కుట్రకు తెరలేపాడు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, టీడీపీకి ఎంత ప్రజాదరణ ఉందో 2019 నుంచి జరిగిన శాసనసభ, పార్లమెంటు ఎన్నికల నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో టీడీపీ ఏ విధంగా ఓడిపోయిందో చూశాం. తాడిపత్రి మున్సిపాల్టీ మినహా రాష్ట్రంలో ఏ ఒక్కటీ గెలవని పరిస్థితుల్లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
చంద్రబాబు కుట్ర రాజకీయాలు, ఆయన రాక్షస మనస్తత్వం వల్లే రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చంద్రబాబు ఎప్పుడు ఏ పార్టీతో అయినా జత కడతాడు.. మరెప్పుడైనా విడిపోతాడు. ఏ సిద్ధాంతాలూ లేని పార్టీ అది. తన స్వప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడైనా, ఎప్పుడైనా ఫణంగా పెట్టదగిన వ్యక్తి చంద్రబాబు. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం లేని వ్యక్తి చంద్రబాబు.
చంద్రబాబు ట్రూ కలర్స్ ను ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.
మాదక ద్రవ్యాల విషయానికొస్తే.. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపే.. అంటే 2019కు ముందే టీడీపీ ప్రభుత్వ హయాంలో.. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి, చంద్రబాబు కేబినెట్ సహచర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మాట్లాడిన వీడియోలు వింటే.. ఏపీలో ఎవరి ప్రభుత్వంలో మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం దేశవ్యాప్తంగా విస్తరించిందో, ఎవరు ఈ వ్యాపారాన్ని ప్రోత్సహించారో అర్థం అవుతుంది.
– మాదక ద్రవ్యాలకు ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని, డీజీపీ, ఇతర పోలీసు అధికారులు పదే పదే చెబుతున్నా.. ప్రభుత్వంపైనా, పోలీసులపైనా పదే పదే ఆరోపణలు చేసి, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి తద్వారా వారిని డీమోరలైజ్ చేసే చర్యల్లో భాగంగా.. మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్ర పరువును తీస్తున్నాడు.
ఎక్కడో తమిళనాడుకు చెందిన వ్యక్తి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ, వేల కోట్ల విలువైన 3 వేల టన్నుల హెరాయిన్ ను ఆప్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ కు అక్కడ నుంచి ముంద్రా పోర్టుకు తీసుకు వెళ్ళి, అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన కంటైనర్లను.. కేవలం ఆ వ్యాపారి భార్యకు సంబంధించిన కుటుంబానికి చెందిన అడ్రస్ విజయవాడ ఇచ్చాడని, హెరాయిన్ కు- ఆంధ్రప్రదేశ్ కు ముడి పెట్టి చంద్రబాబు గత కొద్దిరోజులుగా క్షుద్ర రాజకీయం చేస్తున్నాడు.
వీటిమీద నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చినా.. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తూ ఏపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చెప్పినా.. పదే పదే అవే మాట్లాడుతూ ఏపీ ప్రతిష్టను దిగజారుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు.
2014 నుంచి గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయని, ఇక్కడ నుంచే దేశానికి విస్తరించిందని చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రులే చెప్పారు. చెప్పారు. తన హయాంలోనే తాను గంజాయి అక్రమాలకు పాల్పడి, తాను చట్టాన్ని ఉల్లంఘించి, తాను మాదక ద్రవ్యాల వ్యాపారం చేసి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేస్తున్నాడు. గంజాయి వ్యాపారంలో లోకేష్ కు పార్టనర్ షిప్ ఉందన్న విషయం కూడా ప్రజలందరికీ తెలుసు.
తన రాజకీయ స్వార్థం కోసం, వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ.. తన పార్టీ అనుచరుల చేత ఇటువంటి బూతులు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడించి, ట్రబుల్ క్రియేట్ చేయడం, దేవతా విగ్రహాలు పగులగొట్టించడం.. తద్వారా మతాలు, కులాల మధ్య విద్వేషాలు రగిలించడం చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయంలో నిత్యకృత్యాలు.
బాధ్యత గల వ్యక్తిగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు ఏనాడూ లేడు. అసాంఘీక శక్తులను ప్రోత్సహించడం, అరాచకాలకు ప్రణాళికలు రచించడం, అలజడులు సృష్టించడం చంద్రబాబు నైజం. ఆర్టికల్ 356 పరిస్థితులు రాష్ట్రంలో లేనేలేవు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా, సిస్టమేటిక్ గా, ఈవిల్ డిజైన్స్ తో.. గత నాలుగు నెలలుగా ఈ కార్యక్రమాలు చేపట్టాడు. చంద్రబాబు దుష్ట రాజకీయాలు చూసి ప్రజలంతా చాలా బాధపడుతున్నారు. ప్రతి రోజూ ఏదొక న్యూసెన్స్ క్రియేట్ చేయడం.. దానిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం.. ఇదే బాబు చెత్త రాజకీయం. మరోవైపు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే.. ఎంతసేపటికీ వ్యవస్థలను మేనేజ్ చేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు.
భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని, విడిపోయిన ఏకైక పార్టీ టీడీపీనే. అందుకే ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలను కలిసే ప్రయత్నం చేసినా.. ఎవరూ అపాయింట్ మెంటు ఇవ్వలేదు. రాష్ట్రపతి మొక్కుబడిగా కలిశారు. హోం మంత్రి అపాయింట్ మెంటు ఇవ్వలేదు. చంద్రబాబు ట్రూ కలర్స్ ఏమిటో.. అన్ని రాజకీయా పార్టీలకు తెలుసు కాబట్టి, ఎవరూ కలిసేందుకు ఇష్టపడలేదు.
ఎంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీ కుట్రలు, కుతంత్రాలతో మోసగిస్తావు చంద్రబాబూ..! ఇకనైనా మీ నడవడిక మార్చుకోండి. ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నించండి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు తప్పితే.. కుట్రలను నమ్ముకుంటే మీకు బూడిదే మిగులుతుంది.
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 తరహాలో.. రాజ్యాంగ హోదాల్లో ఉన్న వ్యక్తులకు కూడా చట్టం తేవాలి
– మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా ఇటువంటి బూతు పదజాలం వాడటం తప్పే. దేశంలో జ్యుడీషియరీ గురించి మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 వారికి రక్షణగా ఉంది. మిగతా రాజ్యాంగ ఫంక్షనరీల గురించి అబ్యూజ్డ్ లాంగ్వేజీ మాట్లాడితే.. ఐపీసీలో జనరల్ క్లాజ్ మాత్రమే ఉంది కానీ.. స్పెసిఫిక్ గా చట్టం అంటూ ఏదీ లేదు.
అదే విధంగా.. రాజ్యాంగ ఫంక్షనరీలను పరుష పదజాలంతో తిడితే, అటువంటి వారిపై చర్యలు తీసుకునేలా కేంద్రం ఒక చట్టం తీసుకురావాలి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 ప్రకారం, రాజ్యాంగ హోదాల్లో ఉన్న వ్యక్తులకు కూడా చట్టం తేవాలని డిమాండ్ చేస్తాం. చేయకపోతే.. మేమే ప్రైవేటు బిల్లు ప్రవేశ పెడతాం. ఉత్తమ సంప్రదాయాలు పాటించాలన్నది మా విధానం.
పట్టాభికి బాబు నుంచి ప్రాణభయం
పట్టాభి మాల్దీవులకు వెళ్ళాడు. తనకై తాను పారిపోయాడు. చంద్రబాబు ఎంత స్వార్థపరుడంటే.. పట్టాభిని భౌతికంగా ఎలిమినేట్ చేసి, దానిని వైయస్ఆర్సీపీ మీద రుద్దగలిగిన చాకచక్యం ఉన్న వ్యక్తి. మోసం, దగా అన్నది చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన విద్య. పట్టాభికి చంద్రబాబు గురించి బాగా తెలుసు కాబట్టి, వైయస్ఆర్సీపీకి భయపడి కాదు, చంద్రబాబుకు భయపడి, ఎక్కడ తన ప్రాణాలకు హాని కలుగుతుందనే భయంతో మాల్దీవులకు పారిపోయాడు.
బోషడీకే అనే బూతు పదాన్ని పట్టాబి ఒకసారి కాదు.. 5 సార్లు ఉచ్ఛరించాడంటే, కచ్చితంగా చంద్రబాబు అనుమతితోనే మాట్లాడాడు. పట్టాభి పెద్ద రాజకీయ నాయకుడు కాదు, అతను ఎవరికీ కూడా తెలియని వ్యక్తి. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద చంద్రబాబే ఈ తరహా అసభ్యకరమైన భాష వాడించాడు.
మీరు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, యూపీలకు వెళ్ళి, ఈ తరహా భాష వాడితే.. మీకు ఏ శాస్త్రి జరుగుతుందో మీరే చూస్తారు. అప్పుడు ఆ పదం యొక్క సీరియస్ నెస్ చంద్రబాబుకు అర్థమవుతుంది. మేం న్యాయబద్ధంగా ముందుకు వెళుతున్నాం…
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో చంద్రబాబు ఏ విధంగా మాట్లాడించాడో.. ఆ వీడియోలను కూడా మీడియా ఎదుట ప్రదర్శింపజేశారు.

Leave a Reply