Suryaa.co.in

Andhra Pradesh

భారతీయ జనతా పార్టీకి విశ్వ హిందీ పరిషత్తు సంపూర్ణ సహకారం

-సంస్ధ అఖిల భారత అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్
-తెలుగుదేశం , బిజెపి, జనసేన కూటమి అభ్యర్ధుల పక్షాన ప్రచారం

హిందీ, భారతీయ భాషల అభివృద్దికి అండగా నిలుస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ భరోసా నేపధ్యంలో భారతీయ జనతా పార్టీకి ప్రస్తుత ఎన్నికలలో విశ్వ హిందీ పరిషత్తు సంపూర్ణ సహకారం అందించనుందని సంస్ధ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు విశ్వ హిందీ పరిషత్తు జాతీయ కార్యవర్గం తీర్మానించి అచార్య యార్లగడ్డను ఆంధ్రపద్రేశ్ లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి తగిన ప్రచారం చేయాలని ఆదేశించింది.

ఆచార్య యార్లగడ్డ ఐక్యరాజ్యసమితిలో హిందీకి స్ధానం కల్పించే క్రమంలో ఎనిమిది యూరేషియా దేశాలలో పర్యటిస్తుండగా, బుధవారం ఇండియా చేరుకోనున్నారు. తొలిదశలో గురువారం విజయవాడ పశ్చిమ, కైకలూరు, ఉండి శాసనసభ నియోజకవర్గాలలో, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో అచార్య యార్లగడ్డ పర్యటించి తమ సంఘీభావం తెలపనున్నారు. శుక్రవారం అనకాపల్లిలో ప్రచార కార్యక్రమానకి హాజరుకానున్నారు. అనంతరం ధర్మవరం, రాజంపేటలలో పర్యటించి కూటమి అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తారు. విశ్వహిందీ పరిషత్తు జాతీయ కార్యదర్శి బిపిన్ కుమార్ ఈ మేరకు నిర్ణయించారు.

LEAVE A RESPONSE