వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న పెద్దలెవరో త్వరలోనే తేలుతుంది

– సీబీఐ కేసులో సాక్షుల్ని సీఎస్ తన కారులో తీసుకెళ్లటం ఏంటి?
– నవీన్, కృష్టమోహన్ రెడ్డిలకు ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ చేయటంలో తప్పు లేదని చెప్పటానికి సజ్జల ఎవరు?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ రెడ్డి

వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఎంపీ అవినాష్ రెడ్డి తన ఫోన్ నుంచి భారతిరెడ్డి పీఎ నవీన్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు ఫోన్ చేశారని సీబీఐ విచారణలో తేలింది. ఇందులో తప్పేముందని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. అందులో తప్పు ఉందో లేదో సీబీఐ తేల్చుతుంది, దానిపై మాట్లాడనికి సజ్జల ఎవరు?

మీరేం చేసినా తప్పు కాదు, ఎదుటివారు ఏం మాట్లాడుకున్నా తప్పా? గతంలో మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ నేత సుజనా చౌదరి కలిసి మాట్లాడుకుంటే ఏదో కుట్ర చేస్తున్నారంటే వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. సీబీఐ కేసులో సాక్షులుగా ఉన్న వారిని సీఎస్ జవహర్ రెడ్డి తన కారులో ఎక్కించుకుని వెళ్లటం ఏంటి? ప్రభుత్వ అధికార కార్యక్రమం ఉంటే ఆ పని చూసుకుని వెళ్లాలి. కానీ సీబీఐ విచారణ జరుగుతున్న ప్రాంతంలో ఆయనకే ఏం పని? సీఎస్ రంగ ప్రవేశం చేశారంటే దీని వెనుక పెద్దలు ఉన్నారనేది స్పష్టమవుతోంది. త్వరలో నిజాలు బయటకు వస్తాయి.

సీబీఐ అధికారులు ఏపీకొస్తే సీఎం జగన్ తన పర్యటనలు వాయిదాలు వేసుకుని హడావుడిగా డిల్లీ వెళ్లారు. పైకి మాత్రం సమ్మిట్ లో పాల్గొనడానికి అని చెబుతున్నారు. సీఎం డిల్లీ పర్యటన ఉంటే వారం ముందుగానే మీడియాకు వెల్లడిస్తారు. కానీ హడావుడికి సీఎం డిల్లీ వెళ్లటంలో ఆంతర్యం ఏంటి? వివేకానంద రెడ్డి హత్య జరిగి 4 ఏళ్లు కావాల్సి వస్తోంది. హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకు జగన్ కుటుంబసభ్యుల తీరు అనుమాస్పదంగానే ఉంది. హత్య జరిగిన నాడు చంద్రబాబు, టీడీపీ నేతలు చంపారంటూ ఆరోపణలు చేశారు. తర్వాత ఆస్తి కోసం వివేకా కూతురు, అల్లుడే హత్య చేశారని కధలు అల్లారు.

చివరకు వివేకానందరెడ్డికి అక్రమ సంబందమే హత్యకు కారణమంటూ మరో కధ అల్లి ఆయన వ్యక్తిత్వంపై ఆరోపణలు చేశారు. కొన్ని రోజులకు వివేకా హత్య వైయస్ కుటుంబ సభ్యుల పనేనని ప్రజలకు తెలిశాక, దానిపై ఎవరూ మాట్లాడకూడదంటూ మార్చి 29- 2019న కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సిట్ వేసి విచారణ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వివేకా హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరెడ్డి 2019 – 2 సెప్టెంబర్ 2019న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత వివేకానందరెడ్డి శవానికి కుట్లు వేసిన ఆస్పత్రి ఎండీ ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో చనిపోయాడు.

ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. అందుకే వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరింది. కానీ సీబీఐ విచారణకు సహకరించకుండా సీబీఐ అధికారుల్ని సైతం బెదిరించారు. ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అన్న జగన్ సొంత బాబాయి హత్య కేసును నాలుగేళ్ల నుంచి ఎందుకు తేల్చలేకపోయారు? నాడు జగన్, వైసీపీ నేతలు టీడీపీ నేతలపై ఆరోపణలు చేసి గత ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందారు. వివేకా హత్యకు ముందే అన్ని విషయాలు జగన్ కి తెలుసు.

వివేకాను ఎవరు చంపబోతున్నారో, ఎలా చంపబోతున్నారో కూడా తెలుసు. కానీ రాజకీయ లబ్డి కొసమే నాడు టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు వివేకా హత్య కేసులో అసలు నిందితులు సొంత కుటుం సభ్యులేనని సీబీఐ విచారణలో తేలుతోంది. నాడు నారా సుర రక్త చరిత్ర అంటూ రాసిన తప్పుడు రాతలకు నేడు ఏం సమాధానం చెబుతారు? అని జీవీ రెడ్డి వైసీపీ నేతల్ని నిలదీశారు.

Leave a Reply