Suryaa.co.in

Andhra Pradesh

కుండకు ఓటు వేయండి…మీ జీవితాలు మార్చుకోండి

-కేఏ పాల్

కుండ జీవాన్ని ఇస్తుందని, సత్యాన్ని, మంచిని ఇస్తుందని అన్నారు. కుండ గుర్తు రావడం పట్ల కన్నీరు ఉబికి వస్తోందని అన్నారు. మన విజయానికి కుండ గుర్తే నిదర్శనం అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

“అయ్యో… మనకు ఎన్నికల గుర్తు ఇవ్వరేమో అని బాధపడిన వాళ్లు ఉన్నారు… ఇంకా ఎవరికైనా అనుమానం ఉందా? ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో నేనే స్వయంగా హాజరై వాదనలు వినిపించి ఈ కుండ గుర్తు సంపాదించుకొచ్చాను. ఇప్పటికైనా ఒకటి ఆలోచించండి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని, ఎన్నికలను పోస్ట్ పోన్ చేయించిన వ్యక్తి ఏపీలో 60 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేడా? మా 33 సూత్రాల్లో ఆరు గుర్తుంచుకున్నా చాలు. మా ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి… విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గెలిపించుకోండి… 175 అసెంబ్లీ స్థానాల్లో 100 మందిని గెలిపించుకోండి… మీ జీవితాలు మార్చుకోండి” అని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

కేఏ పాల్ నాయకత్వంలోని ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం కొన్ని రోజుల కిందట కుండ గుర్తు కేటాయించిందన్న విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE