– వక్ఫ్ సవరణ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదు
– పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు నుంచి ఎంత మేలు జరిగిందో అసదుద్దీన్ ఓవైసీ, రాహుల్ గాంధీ చెప్పగలరా?
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన “వక్ఫ్ సుధార్ జనజాగరణ అభియాన్” వర్క్షాప్లో కిషన్ రెడ్డి
హైదరాబాద్: వక్ఫ్ చట్టాన్ని సవరించి పేద ముస్లింలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని గతంలో బిజెపి హామీ ఇచ్చింది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లును రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (ను ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ సుమారు 25 రాష్ట్రాల్లో పర్యటించి, కోటి మందికి పైగా మేధావులు, ప్రజల అభిప్రాయాలను సేకరించింది. అనంతరం కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా నివేదిక సమర్పించి, పార్లమెంటులో 21 గంటల పాటు చర్చ జరిపారు. అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు వక్ఫ్ సవరణ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేశాం. శాంతి నెలకొంది. దేశంలో పేద ముస్లింల హితార్థంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చాం.
బ్రిటిషర్ల హయాంలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టాన్ని 1954లో పునః ప్రవేశపెట్టారు. 1995లో మరింత మార్పులు చేశారు.అయితే, 2013లో యూపీఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను మభ్యపెట్టి వక్ఫ్ చట్టంలో మార్పులు చేసింది. వక్ఫ్ బోర్డు అధికారాలను అపరిమితంగా విస్తరించి, భూములను ఏకపక్షంగా స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించారు.
దేశంలో రైల్వే, రక్షణ శాఖల తర్వాత అత్యధిక భూములు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి. కానీ, ఆ భూముల ఆదాయం పేద ముస్లింలకు ఉపయోగపడలేదు. వక్ఫ్ బోర్డు లాభం మజ్లిస్ పార్టీ నాయకులు, మతపెద్దలు, ల్యాండ్ గ్రాబర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే పొందారు.
పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు నుంచి ఎంత మేలు జరిగిందో అసదుద్దీన్ ఓవైసీ, రాహుల్ గాంధీ చెప్పగలరా? ల్యాండ్ మాఫియా ప్రచారానికి మద్దతు తెలుపుతున్నారు. వాస్తవానికి వక్ఫ్ బోర్డు ఆదాయం పేద ముస్లింలకు ఉపయోగపడడం లేదు.
2006లో వక్ఫ్ ఆస్తుల పరిమాణం 4.9 లక్షల ఎకరాలు కాగా, ఆదాయం రూ. 160 కోట్లు మాత్రమే వచ్చింది. 2013లో అది రూ. 166 కోట్లకు మాత్రమే చేరింది. భూముల విలువ పెరిగినా, వక్ఫ్ బోర్డు ఆదాయం ఎందుకు పెరగలేదో సమాధానం చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం వక్ఫ్ ఆస్తులను సక్రమంగా వినియోగిస్తే ప్రతి సంవత్సరం రూ. 12 వేల కోట్ల ఆదాయం రావచ్చు. ఈ ఆదాయాన్ని పేద ముస్లింలకు వినియోగిస్తామని హామీ ఇచ్చింది. గతంలో వక్ఫ్ భూములపై కొంతమంది రాజకీయ, మత నాయకుల పెత్తనం ఉండేది. వారు లాభాన్ని దొడ్డిదారిన వినియోగించేవారు.
ఇకపై వక్ఫ్గా క్లెయిమ్ చేసే ప్రభుత్వ ఆస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించి, సర్వే చేసి వాటి హక్కును నిర్ధారించాల్సి ఉంటుంది. వక్ఫ్ చట్టంపై కొందరు నాయకులు మతాల మధ్య ఘర్షణలు రేపే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో వక్ఫ్ బోర్డు పరిధిలో 77 వేల ఎకరాల భూమి, 35 వేల ప్రాపర్టీలు ఉన్నాయి. వాటి ఆదాయ వివరాలు రేవంత్ రెడ్డి, ఓవైసీ చెప్పాలి. పేద ముస్లింలకు ఎంత సహాయం చేశారో చెప్పాలి. వక్ఫ్ ఆస్తులను కాంగ్రెస్ ముస్లిం నాయకులు, మజ్లిస్ నేతలు తమ రాజకీయ అధికారం పెంచుకునేందుకు వినియోగించుకున్నారు.
వక్ఫ్ బోర్డు పరిధిలో బినామీ పేర్లతో వందల కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు. వాటి ఆదాయం దారుస్సలాంకు ఉపయోగించబడుతోంది. పేద ముస్లింలకు ప్రయోజనం లేదు. అందుకే వక్ఫ్ సవరణ చట్టం ద్వారా పారదర్శకతతో కూడిన మార్పులు తీసుకురావడం జరిగింది. ఇకపై వక్ఫ్ భూములన్నింటినీ డిజిటలైజ్ చేసి, ప్రతి సంవత్సరం ఆడిట్ చేసి, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది.
ఓవైసీ, కాంగ్రెస్ నాయకులు ధైర్యముంటే.. గత 75 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుతో ఎంతమందికి న్యాయం చేశారో చెప్పాలి.ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వమే. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని మెజారిటీ ముస్లిం సమాజం స్వాగతిస్తోంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో, దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టంలో మార్పులు చేసింది. అసదుద్దీన్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ముస్లింల ఓటుబ్యాంకు కోసం తప్పుడు ప్రచారం చేస్తూ, వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మసీదుల నిర్వహణ వేరు, వక్ఫ్ భూముల నిర్వహణ వేరు. ఈ రెండింటిని కలిపి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరిస్తున్నాం.
వక్ఫ్ బోర్డు పరిధిలో మసీదులు ఉండవు. వాటికి వేరు కమిటీలు ఉన్నాయి. అలాగే ఎండోమెంట్ భూములు వేరు, టెంపుల్ కమిటీలు వేరు. ఈ విషయాలను లింక్ చేయొద్దు.వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతుగా ముస్లిం సమాజం పెద్ద సంఖ్యలో మోదీ గారికి అండగా నిలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ అనంతరం జిల్లాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజల అనుమానాలు నివృత్తి చేస్తుంది. వక్ఫ్ సవరణ చట్టానికి ప్రజల మద్దతు పొందేలా పనిచేయాలని కోరుతున్నాం.