హైదరాబాద్: బిజెపి తెలంగాణ కార్యాలయంలో “వక్ఫ్ సుధార్ జనజాగరణ అభియాన్” వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్ను కేంద్ర మంత్రి & బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ , బిజెపి జాతీయ కార్యదర్శి అర్వింద్ మీనన్ గా, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ జీ రు, శాసనసభ్యులు అభయ్ పాటిల్, శాసనమండలి సభ్యులు మల్కా కుమరయ్య, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు “వక్ఫ్ సుధార్ జనజాగరణ అభియాన్” రాష్ట్ర కన్వీనర్ డా.గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షత వహించారు. వక్ఫ్ సవరణ చట్టంపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు, ఏప్రిల్ 20 – మే 5, 2025 మధ్య జన జాగరణ అభియాన్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాస్తవ సమాచారం అందించడంతో పాటు చట్టంలోని నిజమైన ఉద్దేశ్యాలను వివరించడం జరుగుతుంది.